ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ సిట్ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురిని విచారించి.. వారి వాంగ్మూలాల్ని రికార్డు చేస్తున్న అధికారులు.. తాజాగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డిని తాజాగా విచారించి..వాంగ్మూలాన్నిరికార్డు చేశారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ సాగింది.
ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావు 2020 జూన్ 30న ఉద్యోగ విరమణ పొందగా..అదే రోజు ఆయన్ను మూడేళ్లు కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మరోరెండేళ్లు ఆయన్ను సర్వీసులో కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని ప్రశ్నిస్తూ.. ‘రెండోసారి ప్రభాకర్ రావునుకంటిన్యూ చేయాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగానికి సూచన చేయాల్సిన అవసరమేంటి?’ అన్న కోణంలో సిట్ విచారణ చేయగా..
అప్పటి సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ప్రభాకర్ రావు రిటైర్మెంట్ కావటానికి వారం ముందే తనకు చెప్పటంతో ఆయన్ను అపాయింట్ చేసినట్లుగా పేర్కొన్నారు.
సీఎంగా ఉన్న కేసీఆర్ తనకు ఆదేశాలు జారీ చేయటంతో ఆయన్ను కంటిన్యూ చేయాలని జీఏడీ అధికారులకు సూచన చేశానని.. రాజశేఖర్ రెడ్డి సిట్ కు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలిసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావును గతంలో విచారించిన సమయంలోనూ కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. తాజాగా రాజశేఖర్ రెడ్డి విచారణలోనూ కేసీఆర్ పేరు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 28, 2025 3:17 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…