ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ సిట్ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురిని విచారించి.. వారి వాంగ్మూలాల్ని రికార్డు చేస్తున్న అధికారులు.. తాజాగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డిని తాజాగా విచారించి..వాంగ్మూలాన్నిరికార్డు చేశారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ సాగింది.
ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావు 2020 జూన్ 30న ఉద్యోగ విరమణ పొందగా..అదే రోజు ఆయన్ను మూడేళ్లు కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మరోరెండేళ్లు ఆయన్ను సర్వీసులో కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని ప్రశ్నిస్తూ.. ‘రెండోసారి ప్రభాకర్ రావునుకంటిన్యూ చేయాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగానికి సూచన చేయాల్సిన అవసరమేంటి?’ అన్న కోణంలో సిట్ విచారణ చేయగా..
అప్పటి సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ప్రభాకర్ రావు రిటైర్మెంట్ కావటానికి వారం ముందే తనకు చెప్పటంతో ఆయన్ను అపాయింట్ చేసినట్లుగా పేర్కొన్నారు.
సీఎంగా ఉన్న కేసీఆర్ తనకు ఆదేశాలు జారీ చేయటంతో ఆయన్ను కంటిన్యూ చేయాలని జీఏడీ అధికారులకు సూచన చేశానని.. రాజశేఖర్ రెడ్డి సిట్ కు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలిసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావును గతంలో విచారించిన సమయంలోనూ కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. తాజాగా రాజశేఖర్ రెడ్డి విచారణలోనూ కేసీఆర్ పేరు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 28, 2025 3:17 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…