Political News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కి సుప్రీమ్ షాక్

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిల‌కు సుప్రీం కోర్టులో భారీ షాక్ త‌గిలింది. వారు పెట్టుకున్న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు.. వారిని అరెస్ట్ చెయ్యడానికి ఎటువంటి అడ్డు లేదని తేల్చి చెప్పింది. వారికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు అనుస‌రించిన విధానాలు కూడా స‌రిగాలేద‌ని ఆక్షేప‌ణ వ్య‌క్తం చేసింది. కేసు ద‌ర్యాప్తులో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు సంతృప్తిక‌రంగానే ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే.. పిన్నెల్లి సోద‌రుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డిన సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం.. రెండు వారాల స‌మ‌యం ఇస్తున్న‌ట్టు తెలిపింది. నేటి(శుక్ర‌వారం) నుంచి 2 వారాల్లోగా వారు పోలీసుల ముందు లొంగిపోవాల‌ని ఆదేశిస్తూ.. వారికి స‌మ‌యం ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్‌పై నిందితులు ఉండ‌డం స‌రికాద‌ని.. ఇలా జ‌రిగితే.. కేసు ద‌ర్యాప్తుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించిన కోర్టు.. వారి ముంద‌స్తు బెయిల్‌ను రద్దు చేస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ మేర‌కు  జస్టిస్‌ సందీప్‌ మెహతా ఆదేశాలు జారీ చేశారు.  

ఏం జ‌రిగింది?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో ఈ ఏడాది మే 25న ఇద్ద‌రు వ్య‌క్తులు హ‌త్య‌కు గుర‌య్యారు. వెల్దుర్తి మండలం బోదలవీడు వద్ద గుండ్లపాడుకు చెందిన కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు గ‌తంలో వైసీపీలో ఉండేవారు. పిన్నెల్లికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. రాష్ట్రంలో టీడీపీకూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. వారు పార్టీ మారి టీడీపీలోకి చేరారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది మే 25న వారుతెలంగాణలోని హుజూర్ నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి బైకు మీద వ‌స్తున్న క్ర‌మంలో కొంద‌రు వ్య‌క్తులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణంగా హ‌త మార్చారు.

దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకటరావు, ఏ3 గా తోట గురువయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లను పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో వీరిని ప్ర‌లోభానికి గురి చేసి హ‌త్య‌కు ప్రేరేపించార‌న్న కార‌ణంగా ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చారు. అయితే.. కేసు న‌మోద‌య్యాక వారు ముంద‌స్తు బెయిల్ పొందారు. తాజాగా ముంద‌స్తు బెయిల్‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు వారిని క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on November 28, 2025 3:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

38 minutes ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

3 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

5 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

11 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

12 hours ago