Trends

గ్రీన్ కార్డులపై ట్రంప్ మరో పోటు… మనోళ్లపై ఎఫెక్ట్ ఉంటుందా?

అమెరికాలో వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన ఆ దేశాన్ని కుదిపేసింది. ఒక ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్స్‌పై కాల్పులు జరపగా, అందులో ఒకరు మరణించారు. ఈ ఘటనతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే వలసదారులపై, ముఖ్యంగా గ్రీన్ కార్డుదారులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రతే తమకు ముఖ్యమని, దీని కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేసింది.

ఈ ఘటనకు రియాక్షన్‌గా యూఎస్ పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) సంచలన నిర్ణయం తీసుకుంది. “ఆందోళనకర దేశాల” నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి గ్రీన్ కార్డును జల్లెడ పట్టాలని నిర్ణయించింది. గతంలో జారీ చేసిన కార్డులను కూడా క్షుణ్ణంగా రీ ఎగ్జామిన్ చేయనున్నారు. బైడెన్ హయాంలో పాటించిన “అజాగ్రత్త పునరావాస విధానాల” వల్లే ఇలాంటి ముప్పు వచ్చిందని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతోంది.

అయితే, ఈ వార్త వినగానే అమెరికాలోని భారతీయులు కాస్త కంగారు పడ్డారు. కానీ, ఊపిరి పీల్చుకునే విషయం ఏంటంటే.. ఈ నిబంధనల వల్ల భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు. ఈ క్రాక్‌డౌన్ కేవలం 19 ‘హై రిస్క్’ దేశాలకే పరిమితం. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, వెనిజులా, సుడాన్ వంటి దేశాలు ఉన్నాయి తప్ప, ఇండియా పేరు లేదు. కాబట్టి మనవాళ్ళు సేఫ్.

కాల్పులు జరిపిన వ్యక్తి 2021లో అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళినప్పుడు, బైడెన్ ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా అమెరికా వచ్చాడు. ఇలా వచ్చిన వారిలో ఇంకా ఎంతమంది ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారో అని ట్రంప్ సర్కార్ అనుమానిస్తోంది. అందుకే ఆయా దేశాల నుంచి వచ్చిన వారి రికార్డులను మళ్ళీ తిరగేస్తున్నారు.

ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు, కొత్తగా వచ్చే వాటికి కూడా ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతాయని ఊహించినా, ఈ ఘటనతో అది మరింత వేగవంతమైంది. అమెరికన్ల భద్రత విషయంలో రాజీపడేది లేదని ఈ చర్య ద్వారా వైట్ హౌస్ గట్టి సంకేతాలు పంపింది.

This post was last modified on November 28, 2025 2:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago