‘ఫార్ములా – ఈరేస్’ కేసులో తనను అరెస్టు చేయరని.. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయదని వ్యాఖ్యానించారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పారు. విచారణకు తాను సహకరిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు సహకరిస్తూనే ఉన్నానని.. ఇక నుంచి కూడా తన సహకారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కేటీఆర్ స్పందించారు. గవర్నర్ తన పని తాను చేశారని.. ఒకరకంగా ఇంత జాప్యం ఎందుకు జరిగిందనే విషయం కూడా చర్చిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే తన విచారణను వాయిదా వేసి ఉంటారన్న అభిప్రాయం ఉందని తెలిపారు. తాను అన్నీ నిజాలే చెప్పానని.. ఇకపై కూడా అలానే వ్యవహరిస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ విషయంలో దాచేందుకు ఏమీ లేదన్నారు.
అవసరమైతే.. తనను లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. తాను ఎలాంటి పరీక్షలకైనా.. విచారణలకైనా సిద్ధమేనని తెలిపారు. గతంలో తాను చేసిన లొట్టపీసు కేసు మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇదంతా రాజకీయంగా జరుగుతున్న కేసేనని కేటీఆర్ తెలిపారు. ఇక, రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ అన్యోన్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి బంధం-సంబంధం దేశంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు.
తమ పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ చెప్పారు. అయితే.. వేటు భయపడి కొందరితో రాజీనామాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారని.. అయినా.. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని, ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పా రు. ఉప ఎన్నికల్లో ఈ సారి తమదే విజయమని.. ప్రభుత్వం పరంగా ఎలాంటి ప్రభావం లేదని వ్యాఖ్యానిం చారు.
This post was last modified on November 21, 2025 6:36 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…