‘ఫార్ములా – ఈరేస్’ కేసులో తనను అరెస్టు చేయరని.. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయదని వ్యాఖ్యానించారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పారు. విచారణకు తాను సహకరిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు సహకరిస్తూనే ఉన్నానని.. ఇక నుంచి కూడా తన సహకారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కేటీఆర్ స్పందించారు. గవర్నర్ తన పని తాను చేశారని.. ఒకరకంగా ఇంత జాప్యం ఎందుకు జరిగిందనే విషయం కూడా చర్చిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే తన విచారణను వాయిదా వేసి ఉంటారన్న అభిప్రాయం ఉందని తెలిపారు. తాను అన్నీ నిజాలే చెప్పానని.. ఇకపై కూడా అలానే వ్యవహరిస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ విషయంలో దాచేందుకు ఏమీ లేదన్నారు.
అవసరమైతే.. తనను లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. తాను ఎలాంటి పరీక్షలకైనా.. విచారణలకైనా సిద్ధమేనని తెలిపారు. గతంలో తాను చేసిన లొట్టపీసు కేసు మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇదంతా రాజకీయంగా జరుగుతున్న కేసేనని కేటీఆర్ తెలిపారు. ఇక, రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ అన్యోన్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి బంధం-సంబంధం దేశంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు.
తమ పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ చెప్పారు. అయితే.. వేటు భయపడి కొందరితో రాజీనామాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారని.. అయినా.. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని, ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పా రు. ఉప ఎన్నికల్లో ఈ సారి తమదే విజయమని.. ప్రభుత్వం పరంగా ఎలాంటి ప్రభావం లేదని వ్యాఖ్యానిం చారు.
This post was last modified on November 21, 2025 6:36 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…