Political News

`ఆప‌రేష‌న్ త‌మిళ‌నాడు`.. మోడీ స్టార్ట్ చేసేశారా?

ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా బీజేపీ నేత‌ల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఎన్నిక‌ల‌కు మూడు నాలుగు మాసాల ముందుకాదు.. ఏకంగా ఆరేడు మాసాల ముందే ప్లాన్ వేసుకుంటారు. ఎన్నిక‌ల కోడ్ రావ‌డానికి ముందే రాజ‌కీయ వ్యూహాల‌ను అమ‌లు చేసేస్తారు. ఇది బీజేపీ విజ‌యానికి బ‌ల‌మైన ద‌న్నుగా మారుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ద‌క్కించుకున్న రాష్ట్రాల ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఖ‌చ్చితంగా ఈ త‌ర‌హా వ్యూహం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. బీహార్‌లో ఎన్డీయే విజ‌యం ద‌క్కించుకుంది. కానీ, దీనికి మూలాలు ఎక్క‌డున్నాయంటే.. ఏడు మాసాల ముందుగానే!.

ఎన్నిక‌ల‌కు ఏడు మాసాల ముందుగానే సీతాదేవి పుట్టిన ప్రాంతాన్ని హైలెట్ చేశారు. అక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు. ఒకేసారి ప‌లు ప్రాజెక్టుల‌కు శ్రీకారం కూడా చుట్టారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందే.. మ‌హిళ‌ల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున ముఖ్య‌మంత్రి మ‌హిళా స‌మ్మాన్ నిధి కింద నిధులు జ‌మ చేశారు. అంతేకాదు.. ముందుగానే పొత్తుల‌పై చ‌ర్చించారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి విష‌యంలోనూ ప్ర‌క‌ట‌న చేశారు. ఇలా.. ఎక్క‌డ విజ‌యం కావాలంటే అక్క‌డ అవ‌స‌రానికి అనుగుణంగా బీజేపీ వ్యూహాలువేస్తోంది. వాటిని మోడీ కూడా చక్క‌గా పాటిస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు త‌మిళ‌నాడు వంతు వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది మార్చి-మే మ‌ధ్య కాలంలో త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్నారో ఏమో.. ప్ర‌ధాని మోడీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా బుధ‌వారం(న‌వంబ‌రు 19)నాడు ఆయ‌న త‌మిళ‌నాడులో ప‌ర్య‌టిస్తున్నారు. అంతేకాదు.. ఇక్క‌డి ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ సొంత జిల్లా కోయంబ‌త్తూరుకు వెళ్తున్నారు. అంతేనా.. దేశ‌వ్యాప్తంగా రైతుల‌కు మూడు విడ‌త‌లుగా అందించే పీఎం-కిసాన్ నిధుల‌ను కూడా ప్ర‌ధాని ఇక్క‌డ నుంచే విడుద‌ల చేశారు. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మం ఎప్పుడూ.. ఢిల్లీ వేదిక‌గానే నిర్వ‌హిస్తున్నారు.

కానీ, గ‌త ఆగ‌స్టులో ఈ ఏడాది ఖ‌రీఫ్ సాగుకు సంబంధించిన నిధుల‌ను బీహార్ వేదిక‌గా(ఎన్నిక‌ల‌కు ముందు) ప్ర‌ధాని మోడీ విడుద‌ల చేశారు. ఇప్పుడు రెండో విడ‌త నిధుల‌ను త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు వేదిక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఇక‌, ఇప్ప‌టికే త‌మిళ‌నాడుకు చెందిన బీసీ నాయ‌కుడుసీపీ రాధాకృష్ణ‌న్‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిని చేశామ‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌.. వెర‌సి.. మొత్తంగా ఆప‌రేష‌న్ త‌మిళ‌నాడును ప్రారంభించేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి..త‌మిళ‌లు బీజేపీవైపు.. మోడీ దిశ‌గా మొగ్గు చూపుతారా? అనేది చూడాలి.

Kumar

Recent Posts

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

33 minutes ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

44 minutes ago

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

1 hour ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

2 hours ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

2 hours ago