Political News

లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్‌ నివేదిక ఆధారంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్లు సిట్‌ తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు ఆస్తులు జప్తు కానున్నాయి. అధికార అండతో మోసపూరిత భూ లావాదేవీలు జరిగినట్లు సిట్‌ నిర్ధారించింది. అవినీతి నిరోధక, నేర చట్టాల ప్రకారం జప్తును అనుమతించాలంటూ సిట్‌ సిఫార్సు చేసింది.

డీజీపీ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ జారీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌ రెడ్డి, మోహిత్‌ రెడ్డి భార్య లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్‌రెడ్డి ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్‌ గుర్తించింది. కమీషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు నివేదిక ఇచ్చింది. సిట్‌ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి 63.72కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సిట్ తేల్చింది.

మరోవైపు ఈ స్కాంలో కేసులో నిందితులకు షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పొందిన నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప.. ముగ్గురిని ఈ నెల 26లోపు సరెండర్ కావాలని ఆదేశాలుజారీచేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

This post was last modified on November 19, 2025 3:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago