ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ కితాబు లభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచుగా అనేక విషయాలను పంచుకునే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా నుంచి ఆయన అనూహ్య ప్రశంసలు లభించాయి. చంద్రబాబును ఆయన తిరుగులేని శక్తిగా అభివర్ణించారు. డెవలప్మెంటును కలలు కంటుంటారని మహీంద్రా తెలిపారు. ఈవిషయంలో చంద్రబాబుకు అచంచలమైన అంకితభావం ఉందన్నారు. చంద్రబాబు నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఇదేనని చెప్పారు.
ఎప్పటికప్పుడు తాను అప్డేట్ అవుతూ.. ప్రతి ఒక్కరూ అప్డేట్గా ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని మహీంద్రా తెలిపారు. నూతన విధానాలను అనుసరిస్తారని, ప్రతి ఒక్కరి ప్రమాణాలు పెంచేందుకు చంద్రబాబు దోహద పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు మహీంద్ర ఎక్స్లో పోస్టు చేశారు. కాగా.. ఇటీవల కాలంలో చంద్రబాబుకు పారిశ్రామిక వేత్తల నుంచే కాకుండా.. ప్రముఖ వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులోనూ అనేక మంది ఆయన విజన్ను ప్రశంసించారు.
ఇక, రాజకీయ నేతల నుంచికూడా పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. పెట్టుబడులు, ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, రాజధాని నిర్మాణం.. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు మార్గదర్శి అంటూ.. ఇటీవల కేంద్ర మంత్రి , మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రశంసలు గుప్పించారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. విజన్ ఉన్న నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఏపీలో పాలన చేస్తున్నారని కొనియాడారు. ఇక, విదేశీ ప్రముఖులు కూడా ఇటీవల విశాఖ సదస్సులో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.
This post was last modified on November 19, 2025 6:09 pm
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…