ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ కితాబు లభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచుగా అనేక విషయాలను పంచుకునే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా నుంచి ఆయన అనూహ్య ప్రశంసలు లభించాయి. చంద్రబాబును ఆయన తిరుగులేని శక్తిగా అభివర్ణించారు. డెవలప్మెంటును కలలు కంటుంటారని మహీంద్రా తెలిపారు. ఈవిషయంలో చంద్రబాబుకు అచంచలమైన అంకితభావం ఉందన్నారు. చంద్రబాబు నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఇదేనని చెప్పారు.
ఎప్పటికప్పుడు తాను అప్డేట్ అవుతూ.. ప్రతి ఒక్కరూ అప్డేట్గా ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని మహీంద్రా తెలిపారు. నూతన విధానాలను అనుసరిస్తారని, ప్రతి ఒక్కరి ప్రమాణాలు పెంచేందుకు చంద్రబాబు దోహద పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు మహీంద్ర ఎక్స్లో పోస్టు చేశారు. కాగా.. ఇటీవల కాలంలో చంద్రబాబుకు పారిశ్రామిక వేత్తల నుంచే కాకుండా.. ప్రముఖ వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులోనూ అనేక మంది ఆయన విజన్ను ప్రశంసించారు.
ఇక, రాజకీయ నేతల నుంచికూడా పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. పెట్టుబడులు, ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, రాజధాని నిర్మాణం.. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు మార్గదర్శి అంటూ.. ఇటీవల కేంద్ర మంత్రి , మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రశంసలు గుప్పించారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. విజన్ ఉన్న నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఏపీలో పాలన చేస్తున్నారని కొనియాడారు. ఇక, విదేశీ ప్రముఖులు కూడా ఇటీవల విశాఖ సదస్సులో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.
This post was last modified on November 19, 2025 6:09 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…