Political News

వైవీ సుబ్బారెడ్డి అరెస్ట‌యితే.. వైసీపీలో టెన్షన్.. టెన్ష‌న్‌.. !

వైసిపి పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికీ పలు కేసుల్లో చిక్కుకుని అనేకమంది నాయకులు జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరికొన్ని కేసులు పార్టీ కీలక నాయకులకు చుట్టుకుంటున్నాయి. వీటిలో ప్రధానంగా దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కేసు. ఈ వ్యవహారం ఇప్పుడు అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇటీవల ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. అదేవిధంగా స్థానిక కోర్టుకు కూడా నివేదికలోని అంశాలను వెల్లడించారు. తద్వారా అసలు ఏం జరిగింది.. అనే విషయాలు బయటకు వచ్చాయి. రాజకీయంగా వచ్చిన విమర్శల ప్రకారం శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు లేవని కేవలం ఇవి రాజకీయ విమర్శలేనని సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో అసలు దాన్ని పాల నుంచి గాని వెన్న నుంచి గాని తయారు చేయలేదని పేర్కొనడం మరింత వివాదంగా మారింది.

అసలు నెయ్యిని పామాయిల్ అదేవిధంగా ప్రత్యేక రసాయనాలను ప్రమాదకరమైన రసాయనాలను వినియోగించి తయారు చేశారని సిబిఐ అధికారులు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. అయితే ఇలా నెయ్యి కల్తీ జరిగిన విషయం తెలిసి కూడా అనుమతించారు అనేది ఇప్పుడు వై వి సుబ్బారెడ్డి కి చుట్టుమట్టిన ప్రధాన విషయం. ఇదే విషయాన్ని సిబిఐ కూడా తన నివేదికలో పేర్కొంది. సుబ్బారెడ్డి కి విషయం తెలుసని అయినప్పటికీ ఆయన అనుమతించారని సిబిఐ అధికారులు పేర్కొన్నారు.

దీనికి మద్దతుగా వైవి సుబ్బారెడ్డి అనుచరుడు చిన్న అప్పన్న అరెస్టు కావ‌డం, ఆయన బ్యాంకు ఖాతాలను పరిశీలించినప్పుడు నాలుగు కోట్ల పైచిలుకు మొత్తం అందులో ఉండడం వంటివి ఆధారాలుగా వారు సేక‌రించారు. ఈ మొత్తం పరిణామంతో వైవి సుబ్బారెడ్డి అరెస్టు ఖాయం అనే వాద‌న బలంగా వినిపిస్తోంది. ఈనెల 21న సిట్‌ విచారణకు కూడా వై వి సుబ్బారెడ్డి రానున్నారు. అయితే సుబ్బారెడ్డి గనక అరెస్టు అయితే వైసిపి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు టెన్షన్ టెన్షన్ గా మారింది.

ఆ పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేకమంది అరెస్టు కావడం, జైల్లో ఉండడం ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం మరింత తీవ్రంగా ముసురుకున్న నేపథ్యంలో దీనిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక‌వేళ వైవీ సుబ్బారెడ్డి అరెస్టు అయితే.. ఏమీ కాదులే అనుకునే ప‌రిస్థితి లేదు. ఇది కోట్ల మంది హిందూ ఓట‌ర్లు, వారి మ‌నోభావాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కావ‌డంతో వైవీ కేసుపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

This post was last modified on November 17, 2025 1:31 pm

Share

Recent Posts

సీఎం సినిమా తడబడుతుంది

అసలే తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమా. పైగా విడుదల చాలా ఆలస్యం అయింది. మధ్యలో సినిమా ఆన్…

6 minutes ago

పాత రోజుల్లోకి నారా రోహిత్

రాజకీయాలకు పేరుపడ్డ నారా కుటుంబం నుంచి ఒక నటుడు వస్తున్నాడంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏమాత్రం సక్సెస్ అవుతాడో…

32 minutes ago

అఖిల్ భారతీయుడు కాదా?

భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…

2 hours ago

ష‌ర్మిల ఎక్క‌డున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్‌!?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం…

2 hours ago

మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో…

4 hours ago

అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి…

6 hours ago