తాము అటవీ భూములను ఆక్రమించినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు సరి కాదని వైసీపీ నాయకుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా పవన్ కల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 104 ఎకరాల అటవీ భూములను ఆక్రమించిందని.. ఇవి వారసత్వంగా ఎలా సంక్రమించాయో వివరణ తీసుకోవాలని.. అధికారులను ఆదేశించారు. ఇదేసమయంలో దానికి సంబంధించి తమకు నివేదిక అందించాలని కూడా ఆదేశించారు. ఎక్కడైనా అటవీ భూముల్లో వారసత్వం ఉంటుందా? అన్న ప్రశ్నను కూడా రైజ్ చేశారు.
ఈ పరిణామాలపై పెద్దిరెడ్డి వారసుడు, ఎంపీ మిథున్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాము అటవీ భూములను ఆక్రమించలేదన్న ఆయన.. వాటిని కొనుగోలు చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తాము భూములు కొనుగోలు చేశామని చెప్పారు. వీటికి సంబంధించి తమకు అన్ని రకాల హక్కులు ఉన్నాయని తెలిపారు. కావాలంటే.. ఆన్లైన్లో సర్వే నెంబర్ల వారీగా విచారణ చేసుకోవచ్చని.. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని ఎంపీ తెలిపారు.
ఇదేసమయంలో ఆయా భూములను తాము ఆక్రమించుకున్నట్టు నిరూపించగలరా? అని పవన్కు సవాల్ రువ్వారు. ఆక్రమణ కాదు.. కొనుగోలు చేశామని తాము నిరూపిస్తామన్నారు. అప్పుడు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబాన్ని అభాసు పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. గతంలో కూడా ఎర్రచందనంపై ఇలానే విమర్శలు చేశారని.. అప్పుడు కూడా తాము నిజాయితీని నిరూపించుకున్నామన్నారు.
రాజకీయంగా తమ కుటుంబాన్నిఎదుర్కొనలేక.. అటవీ భూములు ఆక్రమించుకున్నారని.. ఎర్రచందనం దొంగిలించారని ఆరోపణలు చేయడం సరికాదని మిథున్ రెడ్డి చెప్పారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొనాలన్నారు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. తమవ్యాపారాలు.. వ్యవహారాలు అన్నీ నిజాయితీగా సాగుతున్నాయన్న ఆయన.. వాటి ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అందిస్తున్నామని వివరించారు.
This post was last modified on November 13, 2025 11:12 pm
హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో…
కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్న టైమిది. అలాంటిది రీ రిలీజులకు జనాన్ని ఆశించడం కష్టమే. మొన్నటికి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కావాలంటే తొంబై రోజుల ముందే అప్లై చేసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిన్న…
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…