హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో షార్ట్ ఫిలిం తీయడమే అసాధ్యం. అలాంటిది ఒక ఫీచర్ ఫిలిం అసలు ఊహించుకోలేం. కానీ దర్శకుడు రాహి అనిల్ బర్వే దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు. మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాని 80 నిమిషాల నిడివితో రూపొందించి త్వరలోనే యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నాడు. అసలు ట్విస్టులు ఇంకా ఉన్నాయి.
మన్ పిశాచ్ మొత్తం 60 పేజీల స్క్రిప్ట్. చేత్తో గీసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్ లో తీసుకున్న వీడియో రికార్డింగ్స్, ఫోటోషాప్, జనరేటివ్ ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడి దీన్ని పూర్తి చేశారు. కేవలం ఇద్దరు ఆర్టిస్టులు మాత్రమే ఉంటారు. యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే తప్ప ఇంకెవరు వేరే నటీనటులు కనిపించరు. పురావస్తు శాఖకు చెందిన ఒక ఆఫీసర్ సదాశివరావ్ హడమ్ గావ్ అనే ఊరికి వెళ్తాడు. కొండలో నుంచి బయటపడ్డ పెద్ద గుమ్మటం రహస్యం తెలుసుకునేందుకు బరిలో దిగుతాడు.
ఒక పడుచు విధవ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. చీకటి పడగానే విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకునే హడమ్ గావ్ లో అతనికి ఎదురైన దారుణమైన అనుభవాలే మన్ పిశాచ్ స్టోరీ. ట్రైలర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఏఐ జాడలు స్పష్టంగా కనిపిస్తున్నా అసలు 33 వేల రూపాయల్లో ఈ మాత్రం క్వాలిటీ చూపించడం షాక్ కలిగించే విషయం. భవిషత్తులో ఫిలిం మేకింగ్ మీద కృత్రిమ మేధస్సు ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ.
దీన్ని అనిల్ జీరో బడ్జెట్ ఎక్స్ పరిమెంటల్ ఫిలింగా వర్ణిస్తున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో క్లూ ఇస్తున్నాడు. 1960లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మన్ పిశాచ్ రాసుకున్నారు. తుంబాడ్ లాగా ఇది కూడా సక్సెస్ అయితే కొత్త సంచలనానికి దారి తీస్తుందని చెప్పొచ్చు. అయినా నలభై వేలకే ఇంత అవుట్ ఫుట్ రాబడితే ఒకవేళ రెండు మూడు కోట్లు కేటాయించగలిగితే ఏ ప్యాన్ ఇండియా మూవీకి తీసిపోని క్వాలిటీ వస్తుందేమో.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…