Political News

ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!

ఏపీలో వ‌రుస పెట్టుబ‌డులు.. అదే లైన్‌లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంలో నూత‌న సంద‌డి నెల‌కొంది. గురువారం కీల‌క కంపెనీ రెన్యూ ఎన‌ర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో విశాఖ‌లో ఈ ఒప్పందం కుదిరింది. ఇక‌, ఈ నెల‌లోనే గూగుల్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంటోంద‌ని మంత్రి నారా లోకేష్ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

అంతేకాదు.. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌కు గురువారం నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఇది మ‌రో ప్రాజెక్టు అని తెలిపారు. దీనివల్ల త‌క్ష‌ణ‌మే 2 వేల మందికి ఉద్యోగ‌, ఉపాధులు ల‌భించ‌నున్నాయ‌ని వివ‌రించారు. ఈ వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ ద్వారా విశాఖ‌కు 3800 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు రానున్న‌ట్టు నారా లోకేష్ వెల్ల‌డించారు. అన‌కాప‌ల్లిలో త్వ‌ర‌లోనే ఆర్సెల్ లార్ మిట్ట‌ల్ కంపెనీ రానుంద‌ని తెలిపారు. ఇన్పోసిస్ సంస్థ కూడా త్వ‌ర‌లోనే కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు.

ఇక‌, కొంద‌రు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు నారా లోకేష్ త‌న‌దైన శైలిలో జ‌వాబు చెప్పారు. అభివృద్ధిని ఒక ప్రాంతానికే ప‌రిమితం చేస్తున్నామ‌న్న వాద‌న స‌రికాద‌న్నారు. అంద‌రూ ఆలోచ‌న చేయాల‌న్నారు. నెల్లూరు ఏసీలు త‌యారు చేసే ప్రాజెక్టును తీసుకువ‌చ్చామ‌న్నారు. క‌డ‌ప‌లో  సిమెంటు ఫ్యాక్ట‌రీ రానుంద‌న్న ఆయన ప్ర‌కాశంలోనూ అనేక ప్రాజెక్టులు నెల‌కొల్పుతున్న‌ట్టు వివ‌రించారు. కియా ద్వారా తిరుప‌తిలో భారీ ఇమేజ్ పెరిగింద‌ని వివ‌రించారు.

ఈ నెల 14, 15 తేదీల్లో  నిర్వ‌హించే పెట్టుబ‌డుల స‌ద‌స్సు ద్వారా రాష్ట్రానికి మ‌రిన్ని ప్రాజెక్టులు రానున్నాయ‌ని.. వాటిని ద‌శ‌ల వారీగా అన్ని ప్రాంతాల‌కూ విస్త‌రిస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. కొంద‌రు చేస్తున్న విష ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. కేవ‌లం 17 మాసాల్లోనే 15 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చేలా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని వివ‌రించారు.

Kumar

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

45 minutes ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

2 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

3 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

3 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

5 hours ago