టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో కాక రేపాయి. దీంతో, కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, అనూహ్యంగా నాగార్జునపై, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని కొండా సురేఖ ప్రకటించారు.
తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, నాగార్జునను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలన్న, అవమానపరచాలన్న ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సురేఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, రేపు ఈ కేసు విచారణ జరగబోతున్న క్రమంలో నాగార్జున ఆ కేసు వెనక్కు తీసుకుంటారా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖపై పెట్టిన కేసును నాగార్జున వెనక్కు తీసుకున్నారు.
వర్చువల్ విధానంలో కోర్టుకు ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించారు. నాగార్జున ఈ కేసును ఉపసంహరించుకోవడంతో ఆ కేసు కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీంతో, ఈ ఎపిసోడ్ కు తెరపడినట్లయింది. అయితే, ఇకపై అయినా రాజకీయ నాయకులు మాట్లాడేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ నటులైనా..వేరెవరైనా…వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు.
This post was last modified on November 13, 2025 9:26 pm
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…