Political News

కేశినేని ఇంటా-బయటా ఒంటరైపోతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టీడీపీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపిగా అతికష్టం మీద గెలిచారు. వైసీపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ మీద నాని గెలిచింది కేవలం 6 వేల ఓట్లతోనే. సరే 60 వేలైనా 6 వేలైనా గెలుపు గెలుపే అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే నాని గెలిచారో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటి నుండే పార్టీతో సమస్యలు మొదలైందట.

తన ఓటమికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రయత్నించారనేది కేశినేని ఆరోపణ. అందుకనే దేవినేనంటే ఎంపి మహా మంటగా ఉంటున్నారు. కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాలు మొత్తాన్ని చంద్రబాబేమో దేవినేని చేతిలోనే పెట్టారు. దాంతో ఎంపికి ప్రతిరోజు దేవినేనితోనో లేకపోతే ఆయన వర్గంతోనే గొడవలు జరుగుతునే ఉన్నాయి. కంట్రోలు తప్పిన కోపంతో కేశినేని ఒక్కోసారి చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ మీద కూడా విమర్శలు చేయటం పార్టీలు సంచలనంగా మారింది. దాంతో చంద్రబాబుకు కూడా విసుగొచ్చేసి ఎంపిని దూరంగా పెట్టేస్తన్నారని సమాచారం.

ఎప్పుడైతే చంద్రబాబే స్వయంగా ఎంపిని దూరం పెట్టేస్తున్నట్లు గ్రహించారో అప్పటి నుండి పార్టీ నేతలు కూడా దూరంగా పెట్టారట. విజయవాడ లారీ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు ఈమధ్య సమావేశమై గౌరవాధ్యక్షునిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని డిసైడ్ చేశారట. కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని అంటే అర్ధమేంటంటే ఇఫుడు గౌరవాధ్యక్షునిగా కేశినేని ఉన్నారు కాబట్టే. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఎంపి మండిపోతున్నారట.

అలాగే విజయవాడ కార్పొరేషన్ను టీడీపీ గెలిస్తే ఎంపి కూతురికే మేయర్ గా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే మారిన పరిస్దితుల్లో ఎంపి కూతురికి కాకుండా మేయర్ పోస్టును విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ భార్య, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనూరాధకు ఇప్పించే ప్రయత్నాలను పార్టీలోని కమ్మ ప్రముఖులే మొదలుపెట్టినట్లు టాక్. దీంతో ఎంపి మరింతగా మండిపోతున్నారు.

పార్టీలోనే కాకుండా బయట కూడా తమ సామాజికవర్గమే తనకు వ్యతిరేకంగా తయారైందనే మంట కేశినేనిలో పెరిగిపోతోంది. ఒకేసారి ఇటు సామాజికవర్గాన్ని అటు పార్టీ నేతలను దూరం చేసుకోవటంలో ఎంపి ఆలోచన ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఎంపి టీడీపీని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంటా బయటా జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఎంపి ఒంటరైపోతున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.

This post was last modified on December 2, 2020 5:43 pm

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

33 minutes ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

4 hours ago