Political News

కేశినేని ఇంటా-బయటా ఒంటరైపోతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టీడీపీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపిగా అతికష్టం మీద గెలిచారు. వైసీపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ మీద నాని గెలిచింది కేవలం 6 వేల ఓట్లతోనే. సరే 60 వేలైనా 6 వేలైనా గెలుపు గెలుపే అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే నాని గెలిచారో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటి నుండే పార్టీతో సమస్యలు మొదలైందట.

తన ఓటమికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రయత్నించారనేది కేశినేని ఆరోపణ. అందుకనే దేవినేనంటే ఎంపి మహా మంటగా ఉంటున్నారు. కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాలు మొత్తాన్ని చంద్రబాబేమో దేవినేని చేతిలోనే పెట్టారు. దాంతో ఎంపికి ప్రతిరోజు దేవినేనితోనో లేకపోతే ఆయన వర్గంతోనే గొడవలు జరుగుతునే ఉన్నాయి. కంట్రోలు తప్పిన కోపంతో కేశినేని ఒక్కోసారి చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ మీద కూడా విమర్శలు చేయటం పార్టీలు సంచలనంగా మారింది. దాంతో చంద్రబాబుకు కూడా విసుగొచ్చేసి ఎంపిని దూరంగా పెట్టేస్తన్నారని సమాచారం.

ఎప్పుడైతే చంద్రబాబే స్వయంగా ఎంపిని దూరం పెట్టేస్తున్నట్లు గ్రహించారో అప్పటి నుండి పార్టీ నేతలు కూడా దూరంగా పెట్టారట. విజయవాడ లారీ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు ఈమధ్య సమావేశమై గౌరవాధ్యక్షునిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని డిసైడ్ చేశారట. కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని అంటే అర్ధమేంటంటే ఇఫుడు గౌరవాధ్యక్షునిగా కేశినేని ఉన్నారు కాబట్టే. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఎంపి మండిపోతున్నారట.

అలాగే విజయవాడ కార్పొరేషన్ను టీడీపీ గెలిస్తే ఎంపి కూతురికే మేయర్ గా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే మారిన పరిస్దితుల్లో ఎంపి కూతురికి కాకుండా మేయర్ పోస్టును విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ భార్య, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనూరాధకు ఇప్పించే ప్రయత్నాలను పార్టీలోని కమ్మ ప్రముఖులే మొదలుపెట్టినట్లు టాక్. దీంతో ఎంపి మరింతగా మండిపోతున్నారు.

పార్టీలోనే కాకుండా బయట కూడా తమ సామాజికవర్గమే తనకు వ్యతిరేకంగా తయారైందనే మంట కేశినేనిలో పెరిగిపోతోంది. ఒకేసారి ఇటు సామాజికవర్గాన్ని అటు పార్టీ నేతలను దూరం చేసుకోవటంలో ఎంపి ఆలోచన ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఎంపి టీడీపీని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంటా బయటా జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఎంపి ఒంటరైపోతున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.

This post was last modified on December 2, 2020 5:43 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

40 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

56 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago