Political News

రామోజీరావు మరో డిజిటల్ ఐడియా

మీడియా సంస్థ ఏదైనా కానీ.. దానికి ప్రకటనల మీద వచ్చే ఆదాయం చాలా ముఖ్యం. ఇందుకోసం సదరు మీడియా సంస్థలు పడే పాట్లు అన్నిఇన్ని కావు. వ్యాపారం అన్నాక ఆదాయం కోసం ఎంతోకొంత కష్టం తప్పదు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రకటనల ఆదాయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా పుణ్యమా అని.. ప్రింట్ మీడియాకు భారీ దెబ్బ పడింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. డిజిటల్ రంగంలో మీడియాకు వస్తున్న ఆదాయం అంతంతమాత్రమే. దీన్ని మరింత పెంచేందుకు వీలుగా మీడియా మొఘల్ రామోజీ రావు కొత్త ఎత్తు వేసినట్లుగా చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా.. నాలుగు రాష్ట్రాలకు చెందిన కీలకమైన మీడియా సంస్థలు చేతులు కలిపాయి. దీని ద్వారా.. ఎవరైనా యాడ్ ఇవ్వాలంటే.. నాలుగు సంస్థలకు కలిపి ఒకటే యాడ్ మాట్లాడుకోవచ్చు. దీని ద్వారా.. నాలుగు రాష్ట్రాల్లోని వారిని కనెక్టు అయ్యేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

తెలుగుకు సంబంధించి ఈనాడు.. తమిళానికి సంబంధించి దినమలార్.. మలయాళపాఠకులకు సంబంధించి మనోరమా ఆన్ లైన్.. కన్నడిగుల కోసం ప్రజావాణి ఆన్ లైన్ విభాగం ఒకే వేదిక మీదకు వచ్చాయి. దీంతో.. భారీ ఎత్తున ప్రకటన ఆదాయాన్ని సొంతం చేసుకోవాలన్న ఎత్తుగడ వేశాయి. మరీ వ్యూహం ఎంతమేర వర్కువుట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

డిజిటల్ రంగంలో ప్రకటన ఆదాయం భారీగా ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా.. ఎంత చేసినా.. ఆదాయం పెద్దగా రాని పరిస్థితి నెలకొని ఉంది. పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో..నాలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ మీడియా సంస్థలు ఒకటిగా కలిసి యాడ్ ప్యాకేజీని రూపొందించిన ఈ వైనం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. డిజిటల్ మీడియాలో ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవటానికి రామోజీ భారీ ఎత్తుగడే వేశారని చెప్పక తప్పదు.

This post was last modified on December 2, 2020 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago