బాహుబలి తర్వాత చేసిన సాహో అంచనాలను అందుకోలేదు. రాధేశ్యామ్ మీద అంచనాలు మరీ ఎక్కువగా ఏమీ లేవు. దీంతో ప్రభాస్ ఊపు తగ్గినట్లే అనుకున్నారంతా. కానీ గత కొన్ని నెలల్లో ఒకదాని తర్వాత ఒకటిగా అతను అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు చూసి అందరికీ దిమ్మదిరిగిపోతోంది. క్రేజీ కాంబినేషన్లలో మూడు భారీ చిత్రాలను లైన్లో పెట్టాడతను. ఒక్కో సినిమా అనౌన్స్ చేయగానే జనాలు ఔరా అనుకుంటూ చూస్తున్నారు. వాటిపై పెద్ద డిస్కషన్లు పెడుతున్నారు. అతను సెట్ చేసుకుంటున్న కాంబినేషన్ల మీద నడుస్తున్న చర్చకు తోడు.. ఏ సినిమా ఎప్పుడు చేస్తాడన్నది మరో డిస్కషన్ పాయింట్ అవుతోంది.
ఒక హీరో ముందు అనౌన్స్ చేసిన సినిమాను ముందు పట్టాలెక్కిస్తాడనే అంతా అనుకుంటారు. కానీ ప్రభాస్ తీరు దీనికి భిన్నంగా ఉంటోంది. ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో మొదలు కాబోదని స్పష్టంగా తెలుస్తోంది. దాని కంటే ముందు ఓం రౌత్ దర్శకత్వంలో చేయబోయే ఆదిపురుష్ షూటింగ్కు వెళ్తుందని అన్నారు. ఆ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేస్తారని 2021లోనే రిలీజ్ అని ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యే ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అది 2022 మధ్యకు వెళ్లిపోయింది. చిత్రీకరణ ఆలస్యం కావడం వల్లే రిలీజ్ లేటేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణ జనవరి నుంచే మొదలని మేకర్స్ ప్రకటించారు. దీనికి స్క్రిప్టు రెడీగా ఉందని.. ప్రభాస్ ఆరు నెలల్లో ఈ సినిమాను ముగించేసి తర్వాత ఆదిపురుష్ మీదికి వెళ్తాడని తాజాగా అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్లానింగ్, అతడి చర్యలు ఊహాతీతమని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోందిప్పు
This post was last modified on December 2, 2020 8:33 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…