Political News

హైదరాబాద్ స్థాయిలో అమరావతి ఈవెంట్లు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి బ్రాండ్ ఇమేజ్ పెరిగింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాయంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. అమ‌రావ‌తిని కొంద‌రు(వైసీపీ) నాశ‌నం చేయాల‌ని చూశార‌ని.. కానీ, ఇక్క‌డి రైతులు.. ప్ర‌జ‌లు రాజ‌ధానిని కాపాడుకున్నార‌ని చెప్పారు. కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ రాజ‌ధాని ప‌నుల‌ను వేగంగా చేప‌ట్టామ‌న్నారు. దీనికి కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం కూడా అందుతోంద‌ని తెలిపారు. దీంతో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లోనే దాదాపు సగం ప‌నులు పూర్త‌వుతాయ‌ని చెప్పారు.

ఇటీవ‌ల అమ‌రావ‌తి రింగ్ రోడ్డుకు కేంద్ర ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ కూడా ఇచ్చింద‌ని.. ఇక‌, అమ‌రావ‌తిపై ఎవ‌రూ ఎలాంటి భ్ర‌మ‌లూ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అనేక సంస్థ‌లు కూడా ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్న‌ట్టు చెప్పారు. జ‌న‌వ‌రిలో క్వాంట‌మ్ కంప్యూటింగ్ ప్రారంభం అవుతుంద‌న్న ఆయ‌న‌.. దీనికి సంబంధించి కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ కూడా రెడీ అయింద‌ని తెలిపారు. ఇది ర‌వాణా జ‌రిగి.. అమ‌రావ‌తికి రావ‌డ‌మే మిగిలి ఉంద‌న్నారు. ఇక‌, అమ‌రావ‌తిని మెగా సిటీగా రూపాంత‌రం చేస్తున్న‌ట్టు వివ‌రిస్తున్నారు. తద్వారా మ‌రిన్ని ప్రాంతాలు అమ‌రావ‌తి ప‌రిధిలోకి వ‌స్తాయ‌న్నారు.

హైద‌రాబాద్ స్థాయిలో అమ‌రావ‌తిలో ఈవెంట్లు కూడా జ‌రుగుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. విజ‌య‌వాడ కూడా అమ‌రావ‌తిలో భాగ‌మేన‌న్న ఆయ‌న‌.. కృష్ణాన‌దిపై రెండు ఐకానిక్ వంతెన‌ల నిర్మాణం కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌న్నారు. దీంతో పూర్తిస్థాయిలో అమ‌రావ‌తికి-విజ‌య‌వాడ‌కు మ‌ధ్య అనుసంధానం ఏర్ప‌డుతుంద‌న్నారు. అదేవిధంగా హైద‌రాబాద్‌కు -అమ‌రావ‌తికి మ‌ధ్య రోడ్డు ఫెసిలిటీ కూడా ఏర్ప‌డుతుంద‌న్నారు. ఇక‌, ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాల ద్వారా అమ‌రావ‌తికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింద‌ని తెలిపారు. ప‌లు సంస్థ‌లు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావ‌డ‌మే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చారు.

“కొంద‌రు అమ‌రావ‌తిని నాశ‌నం చేయాల‌ని చూశారు. ఇప్పుడు వారు కుళ్లుకునేలాగా.. అమ‌రావ‌తి అభివృద్ధి చెందుతోంది. అనేక సంస్థ‌లు వ‌స్తున్నాయి. కేంద్రం స‌హ‌క‌రిస్తోంది. నిధుల‌కు ఇబ్బంది లేదు. ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక్క‌డి రైతుల‌కు త్వ‌ర‌లోనేన్యాయం చేస్తాం. భూములు ఇవ్వాల‌ని మ‌రోసారి కోరుతున్నాం. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మిస్తే.. అమ‌రావ‌తి ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా మారుతుంది. అది ఏపీకి మాత్ర‌మే కాకుండా దేశానికే త‌ల‌మానికంగా మారుతుంది.“ అని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు.

This post was last modified on November 9, 2025 7:13 am

Share

Recent Posts

ప్రొడ్యూసర్ నానితో… హీరో నితిన్

నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…

32 minutes ago

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

3 hours ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

4 hours ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

4 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

5 hours ago

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

5 hours ago