Political News

హైదరాబాద్ స్థాయిలో అమరావతి ఈవెంట్లు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి బ్రాండ్ ఇమేజ్ పెరిగింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాయంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. అమ‌రావ‌తిని కొంద‌రు(వైసీపీ) నాశ‌నం చేయాల‌ని చూశార‌ని.. కానీ, ఇక్క‌డి రైతులు.. ప్ర‌జ‌లు రాజ‌ధానిని కాపాడుకున్నార‌ని చెప్పారు. కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ రాజ‌ధాని ప‌నుల‌ను వేగంగా చేప‌ట్టామ‌న్నారు. దీనికి కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం కూడా అందుతోంద‌ని తెలిపారు. దీంతో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లోనే దాదాపు సగం ప‌నులు పూర్త‌వుతాయ‌ని చెప్పారు.

ఇటీవ‌ల అమ‌రావ‌తి రింగ్ రోడ్డుకు కేంద్ర ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ కూడా ఇచ్చింద‌ని.. ఇక‌, అమ‌రావ‌తిపై ఎవ‌రూ ఎలాంటి భ్ర‌మ‌లూ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అనేక సంస్థ‌లు కూడా ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్న‌ట్టు చెప్పారు. జ‌న‌వ‌రిలో క్వాంట‌మ్ కంప్యూటింగ్ ప్రారంభం అవుతుంద‌న్న ఆయ‌న‌.. దీనికి సంబంధించి కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ కూడా రెడీ అయింద‌ని తెలిపారు. ఇది ర‌వాణా జ‌రిగి.. అమ‌రావ‌తికి రావ‌డ‌మే మిగిలి ఉంద‌న్నారు. ఇక‌, అమ‌రావ‌తిని మెగా సిటీగా రూపాంత‌రం చేస్తున్న‌ట్టు వివ‌రిస్తున్నారు. తద్వారా మ‌రిన్ని ప్రాంతాలు అమ‌రావ‌తి ప‌రిధిలోకి వ‌స్తాయ‌న్నారు.

హైద‌రాబాద్ స్థాయిలో అమ‌రావ‌తిలో ఈవెంట్లు కూడా జ‌రుగుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. విజ‌య‌వాడ కూడా అమ‌రావ‌తిలో భాగ‌మేన‌న్న ఆయ‌న‌.. కృష్ణాన‌దిపై రెండు ఐకానిక్ వంతెన‌ల నిర్మాణం కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌న్నారు. దీంతో పూర్తిస్థాయిలో అమ‌రావ‌తికి-విజ‌య‌వాడ‌కు మ‌ధ్య అనుసంధానం ఏర్ప‌డుతుంద‌న్నారు. అదేవిధంగా హైద‌రాబాద్‌కు -అమ‌రావ‌తికి మ‌ధ్య రోడ్డు ఫెసిలిటీ కూడా ఏర్ప‌డుతుంద‌న్నారు. ఇక‌, ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాల ద్వారా అమ‌రావ‌తికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింద‌ని తెలిపారు. ప‌లు సంస్థ‌లు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావ‌డ‌మే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చారు.

“కొంద‌రు అమ‌రావ‌తిని నాశ‌నం చేయాల‌ని చూశారు. ఇప్పుడు వారు కుళ్లుకునేలాగా.. అమ‌రావ‌తి అభివృద్ధి చెందుతోంది. అనేక సంస్థ‌లు వ‌స్తున్నాయి. కేంద్రం స‌హ‌క‌రిస్తోంది. నిధుల‌కు ఇబ్బంది లేదు. ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక్క‌డి రైతుల‌కు త్వ‌ర‌లోనేన్యాయం చేస్తాం. భూములు ఇవ్వాల‌ని మ‌రోసారి కోరుతున్నాం. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మిస్తే.. అమ‌రావ‌తి ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా మారుతుంది. అది ఏపీకి మాత్ర‌మే కాకుండా దేశానికే త‌ల‌మానికంగా మారుతుంది.“ అని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు.

This post was last modified on November 9, 2025 7:13 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

2 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

2 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

2 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

4 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

5 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

5 hours ago