ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. శనివారం తిరుపతిలో పర్యటించారు. తిరుపతి నియోజకవర్గం పరిధిలోని మామండూరులో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అటవి తల్లి బాట కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా మామండూరులో దీనికి శ్రీకారం చుట్టారు.
మామండూరు అటవీ ప్రాంతం ఒకప్పుడు దట్టంగా ఉండేది. అయితే.. తర్వాత కాలంలో వృక్షాల చోరీ.. సహా కలప కూడా ఎత్తుకు పోవడంతో ఇక్కడ చెట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పవన్ కల్యాణ్.. మామండూరు అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా త్వరలోనే వేలం వేయాలని భావిస్తున్న ఎర్ర చందనం గోడౌన్ను కూడా ఆయన పరిశీలించారు.
మంగళం ప్రాంతంలో ఉన్న ఎర్ర చందనం గోడౌన్లో భారీ ఎత్తున దుంగలు ఉన్నాయి. వీటిని వేలం వేయాల్సి ఉంది. అయితే.. అంతర్జాతీయ పరిణామాలు.. ఇతరత్రా కారణాలతో ఈ వేలం ప్రక్రియ వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా అడ్డంకులను అధిగమించి త్వరలోనే దీనిని వేలం వేయాలని ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలో సదరు గోడౌన్లో ఎన్ని దుంగలు ఉన్నాయి.? ఏయే రకాల చందనం ఉంది? అనే విషయాలను పవన్ తెలుసుకున్నారు.
ఆకట్టుకున్న లుక్..
తిరుపతి పర్యటనలో పవన్ కల్యాణ్ కొత్త లుక్లో కనిపించారు. ఆర్మీలోని సీఆర్ పీఎఫ్ వాళ్లు ధరించే ఫ్యాంట్ను వేసుకో వడంతోపాటు.. ఖాకీ రంగు షూ ధరించారు. నీలం రంగు టీషర్టు వేసుకున్నారు. దీంతో పవన్ కొత్త లుక్ సంతరించుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన అభిమానులు .. ఫొటోలను జోరుగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లుక్కు భిన్నంగా తొలిసారి సీఆర్ పీఎఫ్ సిబ్బంది ధరించే లేత ఆకుపచ్చ, దానిపై వివిధ రకాల ఆకులతో ఉన్న ఫ్యాంటు ను ధరించడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…