Political News

దేశంలో ఫస్ట్ టైమ్: మావోయిస్టుల ఆయుధ కర్మాగారం స్వాధీనం!

మావోయిస్టులు అనగానే సహజంగా పోలీసు స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను తీసుకువెళ్తారని తెలుసు. లేదా ఒకేసారి గుంపుగా వచ్చి అధికారుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తలు కూడా కొన్ని సార్లు వచ్చాయి. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ నేపథ్యത്തിൽ వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. మరికొందరు తెగించి పోరాడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో లొంగిపోయిన అనంతరం మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు చేసి వారి డంప్‌లను స్వాధీనం చేసుకుంటున్నారు.

మావోయిస్టుల డంప్‌లు అంటే ఆయుధాలు, నిత్య వినియోగ సామగ్రి, సాహిత్య పుస్తకాలు, ఫోన్లు ఇలా అనేక వస్తువులను అడవీ ప్రాంతాల్లోని భూగర్భంలో ఎవరు గుర్తించని ప్రాంతాల్లో దాచుకుంటారు. ఎంత అనుభవం ఉన్న అటవీ శాఖ అధికారులు అయినా ఈ డంప్‌లను గుర్తించడం కష్టం. అలాంటిది తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఓ భారీ ఆయుధ కర్మాగారాన్ని సాయుధ బలగాలు గుర్తించారు. ఇటీవలి కాలంలో పోలీసుల ముందు లొంగిపోయిన పెద్ద నాయకులు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలో వారికి భారీగా ఆయుధాలు లభించాయి. 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాల తయారీ సామగ్రి, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునే నైపుణ్యంతో కూడిన సామగ్రి కూడా లభించడం విశేషం. వీటిని సాధారణంగా రక్షణ శాఖ మాత్రమే వినియోగిస్తుందని, ఈ తరహా తయారీ యూనిట్లపై దేశంలో నిషేధం ఉందని ఒక అధికారి తెలిపారు. మందుగుండు తయారీకి సంబంధించిన పుస్తకాలను కూడా గుర్తించారు. అదేవిధంగా తుపాకుల తయారీకి వినియోగించే ప్రత్యేక మెటీరియల్‌తో పాటు ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా వెలుగు చూసిన ఆయుధ తయారీ కర్మాగారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ రహస్య ఆయుధ కర్మాగారానికి ముందు చెట్లు, తుప్పలు ఉండటంతో ఎవరు గుర్తించకుండా ప్రత్యేకంగా కంపను ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. అంతేకాదు ఎంతోమంది సీనియర్లు కూడా దీన్ని అటవీ భాగంగానే భావించారని వివరించారు. కాగా ఇప్పటి వరకు 500 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 340 మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు.

This post was last modified on November 5, 2025 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

22 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago