Political News

గుంతల రోడ్లే మేలంటోన్న బీజేపీ ఎంపీ

ఒక సగటు మనిషి చేసే కామెంట్లకు…బాధ్యత గల ప్రజాప్రతినిధులు చేసే కామెంట్లకు చాలా తేడా ఉంటుంది..ఉండాలి కూడా. కానీ, ఈ మధ్యకాలంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే…వారికన్నా కామన్ మ్యాన్ 100 రెట్లు నయం అనిపిస్తుంది. చదువూ లేదు…సంధ్యా లేదూ…అనే టైప్ పొలిటిషియన్లు టంగ్ స్లిప్ అయ్యారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యావంతులు అయిన రాజకీయ నాయకులు కూడా నాలుక కరుచుకోవడం శోచనీయం. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ కోవలోకే వస్తారు. రోడ్లను ఉద్దేశించి తాజాగా ఆయన చేసిన కామెంట్లు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీర్జాపూర్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులపై తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్-తాండూర్ జాతీయ రహదారిని కొత్తగా నిర్మించాలని, ఆ మార్గంలో నిత్యం యాక్సిడెంట్లతో దాదాపు 200 మంది వరకు చనిపోయారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు రోడ్డుపై నుంచి కదలబోమని స్థానికులు ఈ రోజు తాండూర్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కూడా నిర్వహించారు.

ఓ వైపు ఆ జాతీయ రహదారిపై ఉన్న గుంతలు, కొత్త రోడ్డు నిర్మాణం గురించి చర్చ, ధర్నాలు, ఆందోళనలు జరుగుతుంటే మరోవైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందుకు పూర్తి భిన్నంగా ఇచ్చిన స్టేట్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావని, రోడ్లు మంచిగుంటేనే యాక్సిడెంట్లు అవుతాయని బాధ్యతారాహిత్యంగా ఆయన మాట్లాడిన మాటలపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

రోడ్లు నున్నగా, కొత్తగా, బాగుంటే వాహనాలను అతి వేగంతో నడుపుతారు, కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అనే యాంగిల్ లో పల్లెటూరి జనం మాట్లాడుకుంటూ ఉంటారు. రోడ్లపై గుంతలు ఉంటేనే మంచిదని, నిదానంగా వాహనాలు వెళతాయి కాబట్టి యాక్సిడెంట్లు జరగవని రచ్చబండ సమావేశాల్లో జనం నిపుణుల మాదిరి అభిప్రాయడుతుంటారు. అయితే, రాత్రి పూట రోడ్లపై గుంతలు కనిపించక, పగటి పూట గుంతలు కనిపించినా వాటిని తప్పించబోయి ప్రమాదాలకు గురైన వాహనాలు కోకొల్లలు. ఈ విషయం ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియకుండా ఉండదు.

అయినప్పటికీ, సగటు మనిషి మాదిరిగా రోడ్లు ఖరాబ్ గా ఉంటేనే ప్రమాదాలు జరగవన్న అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తపరచడం నిజంగా విచారకరం. మరి, తన కామెంట్లపై విమర్శలు వస్తున్న క్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీనిచ్చే ప్రయత్నం చేస్తారా లేక తన వ్యాఖ్యలను సమర్థించుకుంటారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణలో గుంతలతో ఉన్న రోడ్లు అలాగే ఉంచాలని, కొత్త రోడ్లు అవసరం లేదని అర్థం వచ్చేలా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లు ట్రోలర్లకు మంచి మెటీరియల్ ఇచ్చాయి.

This post was last modified on November 4, 2025 8:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

58 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago