Political News

లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!

లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం.. కీల‌క భేటీ నిర్వ‌హించారు. లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న‌ర్ (ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి)తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల‌కుపైగా సాగిన ఈ బేటీలో ప‌లు కీల‌క విష‌యాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా విక్ర‌మ్ దొరైస్వామి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌ను త‌ను విడిది చేస్తున్న హోట‌ల్‌కు పిలిపించుకున్న సీఎం చంద్ర‌బాబు.. అనేక విష‌యాల‌పై చ‌ర్చించారు.

ప్ర‌ధానంగా ఏపీలోని యూనివ‌ర్సిటీల‌లో లండ‌న్ త‌ర‌హా విద్యా బోధ‌న అంశాల‌కు సంబంధించిన సూచ‌న‌లు చేయాల‌ని కోరారు. అదేవిధంగా బ్రిట‌న్‌లోని ప్ర‌ఖ్యాల విశ్వ‌విద్యాల‌తో ఏపీలోని ఆంధ్ర‌, శ్రీవేంక‌టేశ్వ‌ర‌, నాగార్జున విశ్వ‌విద్యాల‌యాల‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా విదేశీ విద్యార్థుల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేయ‌డంపైనా దొరైస్వామితో చంద్ర‌బాబు చ‌ర్చించారు. మ‌రీ ముఖ్యం గా ఏపీ విశ్వ‌విద్యాల‌యాల‌లో మ‌రింత‌ నాణ్య‌మైన విద్య‌ను చేరువ చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం.. అదేవిధంగా అమ‌లుపైనా చ‌ర్చించారు.

కేంద్ర ప్ర‌భుత్వం-బ్రిట‌న్ భాగ‌స్వామ్యంతో ఏపీలో ఏర్పాటు చేయ త‌ల‌పెట్టిన జాయింట్ వెంచ‌ర్ల‌పైనా ఇరువురు చ‌ర్చించారు. ఏపీలో ఉన్న అవ‌కాశాలు, యువ శ‌క్తి, ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాల‌ను సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిలో క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటు, విశాఖ‌లో గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు వంటి విష‌యాల‌ను చ‌ర్చించారు. త‌ద్వారా ప్ర‌పంచ స్థాయి యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనేక ప్రోత్సాహ‌కాలు ఇస్తోంద‌న్నారు. బిటన్ విశ్వ‌విద్యాల‌యాల‌తో ప‌రిశోధ‌న‌, ఇన్నోవేష‌న్ రంగాల్లో ఏపీ విశ్వ‌విద్యాల‌యాలు క‌లిసి ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

మొత్తంగా.. భార‌త హైక‌మిష‌న‌ర్‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఇటీవ‌ల కుదుర్చుకున్న ఒప్పందాలు.. వాటి సానుకూలత‌, స‌హా బ్రిట‌న్ నుంచివ‌చ్చే వ్యాపారులు, పెట్టుబ‌డిదారుల‌కు స‌రైన వివ‌రాలు అందించేలా సాయం చేయాల‌ని దొరైస్వామిని సీఎం చంద్ర‌బాబు కోరారు. ఏపీలో ఉన్న అపార అవ‌కాశాల‌ను కూడా ఆయ‌న‌కు వివ‌రించారు. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అందుకునే రెండు అవార్డుల ఫంక్ష‌న్‌ల‌లోనూ పాల్గొంటారు. అనంత‌రం.. సీఐఐ నిర్వ‌హించే రోడ్ షోలోనూ పాల్గొంటారు.

This post was last modified on November 4, 2025 8:40 pm

Share

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

44 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

48 minutes ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

1 hour ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

2 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

2 hours ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

5 hours ago