Political News

పవన్ ఏఐ ప్లాన్ పని చేసింది!

అటవీ పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలలో మనుషులు, జంతువుల మధ్య సమన్వయం ఉండడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఏనుగులు గ్రామాలలోకి వచ్చి పంట నష్టం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలా ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇచ్చింది.

అంతటితో ఆగని పవన్ కల్యాణ్…టెక్నాలజీని ఉపయోగించుకొని ఏనుగులను తరిమివేసేలా చర్యలు చేపట్టారు. ఏఐ టెక్నాలజీ సాయంతో గన్ షాట్ శబ్దాల ద్వారా ఏనుగులను తరిమివేస్తున్నారు. సోలార్ ప్యానెళ్ల ఆధారిత ఏఐ టెక్నాలజీ సాయంతో ఏనుగుల రాకను గుర్తించే ఈ వినూత్న పద్ధతిలో వస్తున్న తుపాకీ పేలుడు శబ్ధాలు విని ఏనుగు ఒకటి పారిపోతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. పవన్ వినూత్న ఆలోచన సత్ఫలితాలను ఇస్తుండడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. గ్రామాలలోకి ఏనుగులు అడుగుపెట్టకుండా ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ ఏఐ ఆధారిత తుపాకీ శబ్దాలు సత్ఫలితాలనిస్తుండంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా దీనిని అమలు చేసేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వినూత్న పద్ధతిని పొరుగు రాష్ట్రాల వారు కూడా అనుసరించే యోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది. బహుశా ఈ తరహా టెక్నాలజీని వాడి ఏనుగులను తరిమివేసిన తొలి రాష్ట్రం ఏపీనే అని పవన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

This post was last modified on November 4, 2025 1:19 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan Kalyan

Recent Posts

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

12 minutes ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

3 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

4 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

7 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

7 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

8 hours ago