Political News

ఇలా వెళ్లారు.. అలా 20 వేల కోట్ల పెట్టుబ‌డి తెచ్చారు!

రాష్ట్రానికి పెట్టుబ‌డుల వేటలో ఉన్న సీఎం చంద్ర‌బాబు మ‌రో అద్భుతం సాధించార‌నే చెప్పాలి. ఆయ‌న ప్ర‌స్తుతం లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లోనూ పెట్టుబ‌డులే కీల‌కంగా ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా 20 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులను దూసుకొచ్చారు. ఒక్క చిన్న ప్ర‌య‌త్నంతో చంద్ర‌బాబు ఈ విజ‌యం సాధించారు. ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు హిందూజా గ్రూప్ ముందుకు వ‌చ్చింది. ఆ వెంట‌నే ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో చంద్ర‌బాబు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఏం జ‌రిగింది?

లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ హిందుజా గ్రూప్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో ఉన్న అవ‌కాశాల‌ను వారికి వివ‌రించారు. విశాఖ స‌హా ప‌లు ప్రాంతాల్లో పెట్టుబ‌డులకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని, అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌ను కూడా కూలంక‌షంగా వారితో చ‌ర్చించారు. ఆయా అంశాల‌పై చంద్ర‌బాబు చెప్పిన విషయాల‌ను ఆస‌క్తిగా విన్న హిందుజా గ్రూప్‌ ప్ర‌తినిధులు, వెంట‌నే రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చారు. ద‌శ‌ల వారీగా ఈ పెట్టుబ‌డులు ఏపీకి రానున్నాయి. అదేస‌మ‌యంలో ఈ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశాఖ పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు కూడా వ‌స్తామని హామీ ఇచ్చారు.

హిందూజా పెట్టుబ‌డులు ఇలా:

విశాఖలో ఇప్ప‌టికే ఉన్న హిందుజా విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని 1,600 మెగావాట్లు పెంచుతారు.

రాయలసీమ విద్యుత్ ప్లాంట్లలో పెట్టుబ‌డులు పెట్ట‌నున్నారు.

కృష్ణాజిల్లాలోని పారిశ్రామిక కారిడార్ మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల త‌యారీలో పెట్టుబ‌డులు పెడ‌తారు.

తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను హిందుజా ఏర్పాటు చేయ‌నుంది.

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకో సిస్టమ్ (హరిత ర‌వాణా వ్య‌వ‌స్థ‌) అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌నున్నారు.

This post was last modified on November 3, 2025 11:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

56 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago