శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు.
ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో చాలామంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనఫై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తనను కలచి వేసిందని, భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ ఘటనపై హోం శాఖా మంత్రి అనిత స్పందించారు. ఆలయం మొదటి అంతస్థులో ఉందని, 20 మెట్లు ఎక్కి ఆ అంతస్థుకు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆ క్రమంలో మెట్ల రెయిలింగ్ ఊడి పడడంతోనే ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
This post was last modified on November 1, 2025 1:33 pm
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…