మంత్రి పదవులు ఆశించిన వారి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ నేతలు.. రేవంత్రెడ్డి మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే.. వివిధ కారణాలతో వారికి అవకాశం చిక్కలేదు. నిజానికి 18 మంది వరకు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. కానీ.. పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించ లేదు. తాజాగా చేసిన విస్తరణలోనూ ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు.
దీంతో మంత్రివర్గంలో చోటు కోసం.. కొన్నాళ్లుగా ప్రయత్నించడంతోపాటు.. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా హామీపొందారన్న చర్చ ఉన్న ఇద్దరు నాయకులకు.. కూడా అవకాశం చిక్కలేదు. దీంతో తాజాగా వారిలో ఒకరికి కార్పొరేషన్ పదవిని.. మరొకరికి కొత్తగా సలహారు పోస్టును క్రియేట్ చేసి.. మంత్రులకు ఉండే అన్ని సదుపాయాలను కల్పించారు. అదేవిధంగా భద్రత నుంచి కాన్వాయ్ వరకు కూడా సౌకర్యాలు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరు వారు?
1) మంచిర్యాల నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు. ఈయనను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా నియమించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. మంత్రులకు కల్పించేకేబినెట్ హోదాతో పాటు.. కాన్వాయ్, భద్రతను కూడా కల్పిస్తారు. అదేవిధంగా వేతనాలను కూడా మంత్రులకు ఇచ్చే వేతనాలనే ఇస్తారు.
2) పి. సుదర్శన్ రెడ్డి: ఈయన బోధన్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. సీనియర్ మోస్ట్ నాయకుడు. గతంలోనూ మంత్రిగా పనిచేశారు. ఈయన కూడా పార్టీ విజయం దక్కించుకున్నాక.. మంత్రి వర్గంలో సీటు కోసం ప్రయత్నించారు. తాజాగా అయినా.. దక్కుతుందని కొన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. అయితే.. సీటు దక్కలేదు. దీంతో సర్కారుకు సలహాదారుగా నియమించారు. మంత్రులకు వర్తించే అన్ని సౌకర్యాలతో పాటు కాన్వాయ్, భద్రత లభిస్తుంది. అంతేకాదు.. మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా వచ్చేందుకు అవకాశం కల్పించారు.
This post was last modified on October 31, 2025 6:57 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…