మాట పెళుసు.. మనిషి కరుకు.. అన్న పేరు తెచ్చుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. తనకు మంత్రి పదవి ఇవ్వాలని.. ఇస్తారని.. కానీ కొందరు అడ్డు పడుతున్నారని వ్యాఖ్యానిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ రాజా.. తనదైన శైలిలో విమర్శలు గుప్పి స్తున్న విషయం తెలిసిందే. అనేక సందర్భాల్లో ఆయన మంత్రి పీఠంపై అనేక వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి పదవులు ఇవ్వడం లేదా? నాకు ఇస్తే తప్పేంటని కూడా ప్రశ్నించారు.
అంతేకాదు.. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వారికి.. కొత్తగా గెలిచిన వారికి కూడా పదవులు ఇచ్చారని.. తనను మాత్రం దూరం పెట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లోనూ రాజగోపాల్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అసలు ఏ చట్ట సభకు ప్రాతినిధ్యం వహించని.. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. ఇక, కొన్నాళ్లుగా వెయిటింగ్ లిస్టు లో ఉన్న.. ప్రేమ్సాగర్రావు, సుదర్శన్రెడ్డికి కూడా.. నామినేటెడ్ పదవులు ఇచ్చి.. కేబినెట్ హోదా కల్పించారు.
కానీ, కావాలి.. కావాలి.. అంటూ.. మంత్రి పీఠం పై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. అయితే.. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. కొందరు రాజగోపాల్ విషయంలో సానుభూతి చూపిస్తే.. మరికొందరు.. ఆయన కొన్ని హద్దులు మీరారని వ్యాఖ్యానించారు. పదువులు కావాలని.. రావాలని కోరుకున్న నాయకులు కొంత వినయంతో ఉండాలని కొందరు సూచించారు.
మరికొందరు.. హెచ్చరించి, విమర్శలు చేస్తే.. పార్టీ అధిష్టానం సహించదని.. గతంలో అనేక అనుభవాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇంకొందరు.. సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే నని.. ఇప్పుడు పదవులు పొందిన వారుకూడా.. చాలా ఓపిక, సహనంతో వేచి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలనిచెబుతున్నారు. ఇలా.. రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి రాజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on October 31, 2025 6:57 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…