ఏపీలో జరిగిన మేయర్ దంపతుల దారుణ హత్య కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 లక్షల రూపాయల జరిమానా విధించిన కోర్టు.. దీనిలో 50 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి అందించాలని, మరో 20 లక్షల రూపాయలను గాయపడిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లా స్థాయి కోర్టు జడ్జి సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు ఏం జరిగింది?
చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్.. కఠారి మోహన్రావు.. కీలక నాయకుడు. ఆయన భార్య అనురాధ.. 2015లో చిత్తూరు నగర కార్పొరేషన్లో మేయర్గా వ్యవహరించారు. అయితే.. ఈ కుటుంబానికే చెందిన మోహన్రావు మేనల్లుడు.. శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, చిట్టబ్బాయి, చిట్టితో వివాదాలు ఏర్పడ్డాయి.
రాజకీయంగా, ఆర్థికంగా కూడా మేనల్లుడు, మేనమామ, మేనత్తల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు జరిగాయి. ఈ క్రమంలో మేయర్గా ఉన్న మేనత్త, పార్టీ నాయకుడిగా ఉన్న మోహన్రావులను చంపేస్తేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావించిన చింటూ.. తన స్నేహితులతో కలిసి దారుణ హత్యకు పాల్పడ్డారు.
మేయర్ ఛాంబర్లోనే..
తన మేనత్త, మేయర్ అనురాధ దంపతులను హత్య చేయాలని ప్లాన్ చేసిన చింటూ.. దీనికి మేయర్ ఛాంబర్నే వేదిక చేసుకున్నారు. 2015, నవంబరు 17న చింటూ అతని స్నేహితులు మరో నలుగురు బురఖాలతో వెళ్లి.. తుపాకులు, కత్తులతో అనురాధను హత్య చేశారు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అక్కడితో ఆగని చింటూ.. పక్క గదిలోనే ఉన్న మేనమామ మోహన్ను కూడా కత్తులతో నరికేశాడు. ఈ హత్యాకాండ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఉరి శిక్ష పడింది వీరికే..
ఏ1: శ్రీరామ్ చంద్రశేఖర్
ఏ2: గోవింద స్వామి శ్రీనివాసయ్య
ఏ3: జయప్రకాష్రెడ్డి అలియాస్ జయారెడ్డి
ఏ4: మంజునాథ్ అలియాస్ మంజు
ఏ5: మునిరత్నం వెంకటేష్
This post was last modified on October 31, 2025 3:23 pm
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…