Political News

టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌

ఏపీలో జ‌రిగిన మేయ‌ర్ దంప‌తుల దారుణ హ‌త్య కేసులో స్థానిక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన కోర్టు.. దీనిలో 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను బాధిత కుటుంబానికి అందించాల‌ని, మ‌రో 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను గాయ‌ప‌డిన వ్య‌క్తికి ఇవ్వాల‌ని జిల్లా స్థాయి కోర్టు జ‌డ్జి సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అసలు ఏం జ‌రిగింది?

చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయ‌కుడు, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్‌.. క‌ఠారి మోహ‌న్‌రావు.. కీల‌క నాయ‌కుడు. ఆయ‌న భార్య అనురాధ‌.. 2015లో చిత్తూరు న‌గ‌ర కార్పొరేష‌న్‌లో మేయ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఈ కుటుంబానికే చెందిన మోహ‌న్‌రావు మేన‌ల్లుడు.. శ్రీరామ్‌ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, చిట్ట‌బ్బాయి, చిట్టితో వివాదాలు ఏర్ప‌డ్డాయి.

రాజ‌కీయంగా, ఆర్థికంగా కూడా మేన‌ల్లుడు, మేన‌మామ‌, మేన‌త్త‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వివాదాలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో మేయ‌ర్‌గా ఉన్న‌ మేన‌త్త‌, పార్టీ నాయ‌కుడిగా ఉన్న మోహ‌న్‌రావుల‌ను చంపేస్తేనే త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని భావించిన చింటూ.. త‌న స్నేహితుల‌తో క‌లిసి దారుణ హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

మేయ‌ర్ ఛాంబ‌ర్‌లోనే..

త‌న మేన‌త్త‌, మేయ‌ర్ అనురాధ దంప‌తుల‌ను హ‌త్య చేయాల‌ని ప్లాన్ చేసిన చింటూ.. దీనికి మేయ‌ర్ ఛాంబ‌ర్‌నే వేదిక చేసుకున్నారు. 2015, నవంబరు 17న చింటూ అత‌ని స్నేహితులు మరో నలుగురు బురఖాలతో వెళ్లి.. తుపాకులు, కత్తులతో అనురాధను హ‌త్య చేశారు. ఆమె అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డితో ఆగ‌ని చింటూ.. ప‌క్క గదిలోనే ఉన్న మేన‌మామ‌ మోహన్‌ను కూడా కత్తులతో నరికేశాడు. ఈ హ‌త్యాకాండ అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

ఉరి శిక్ష ప‌డింది వీరికే..

ఏ1: శ్రీరామ్‌ చంద్రశేఖర్‌
ఏ2: గోవింద స్వామి శ్రీనివాసయ్య
ఏ3: జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జయారెడ్డి
ఏ4: మంజునాథ్‌ అలియాస్‌ మంజు
ఏ5: మునిరత్నం వెంకటేష్‌

This post was last modified on October 31, 2025 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

59 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

7 hours ago