Political News

ఆ 40 శాతం కోస‌మైనా చేసిందేముంది.. జ‌గ‌న్ ..!

గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌కు 40 శాతం మేర‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేశార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు. అందుకోస‌మైనా.. వారి త‌ర‌ఫున ప్ర‌శ్నించేందుకైనా.. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని ఆయ‌న ఇటీవ‌ల కూడా ప్ర‌భుత్వాన్ని, స్పీక‌ర్‌ను కూడా కోరారు. ఇదిలావుంటే.. మొంథా తుఫాను స‌మయంలో జ‌గ‌న్ అందుబాట‌లో లేని విష‌యం తెలిసిందే. తాను బెంగ‌ళూరులో ఉన్నాన‌ని.. విమాన సేవ‌లు నిలిపివేయ‌డంతో రాలేక పోయాన‌ని చెప్పారు.

కానీ, పార్టీ త‌ర‌ఫున అయినా.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన అనేక నిర‌స‌న‌లు, ధర్నాల్లో జ‌గ‌న్ నేరుగా ఎక్క‌డా పార్టిసిపేట్ చేయ‌లేదు. కేవ‌లం తాడేప‌ల్లిలో కూర్చుని త‌న మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు యువ‌త‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ముందుకు న‌డిపించారు. ఇలానే.. తాజా ప‌రిణామాల క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ఆయ‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను రంగంలోకి దింపి ఉండాల్సింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటేసిన 40 శాతం మంది కోస‌మైనా.. జ‌గ‌న్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే.. బాగుండేద‌ని కొంద‌రు సూచిస్తున్నారు. తాజాగా సంభ‌వించిన తుఫానులో ఆ 40 శాతం మంది ప్ర‌జ‌ల్లో క‌నీసం 10-15 శాతం మందైనా ఉంటార‌ని.. వారిని ఆదుకునేందుకు.. లేదా భ‌రోసా క‌ల్పించేందుకు.. ఆర్థిక సాయం అందించేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించి ఉంటే బాగుండేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, బాధితుల్లో వైసీపీ అభిమానులు కూడా ఉండి ఉంటారు. ఇందులో సందేహంలేదు.

మ‌రి వారి కోస‌మైనా.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే బాగుండేద‌న్న చ‌ర్చ ఉంది. కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న‌కు ఓటేసిన 40 శాతం మందితో పాటు.. పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ప‌ట్టించుకోలేదు. కేవ‌లం బెంగ‌ళూరుకే ప‌రిమిత‌మై.. వ‌ర్షాలు, తుఫాను త‌గ్గుముఖం ప‌ట్టాక తాడేప‌ల్లికి చేరుకున్నారు. మ‌రి ఈ ప్ర‌భావం పార్టీపై ప‌డ‌దా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించాల్సిన జ‌గ‌న్.. ఇంకా పాఠాలు నేర్చుకోవ‌డం లేద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌.

Satya

Recent Posts

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…

1 hour ago

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

6 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

9 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

11 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

11 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

11 hours ago