Political News

ష‌ర్మిల‌కు ఏపీ గుర్తులేదా ..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డం.. తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై ఆమె అనేక వ్యాఖ్య‌లు చేసి.. సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా న్యూస్‌గా కూడా మిగిలారు. అయితే.. పార్టీ అధిష్టానం చేసిన కొన్ని సూచ‌న‌ల‌తోపాటు.. స్థానిక నాయ‌కత్వం కూడా.. ష‌ర్మిల‌కు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేయ‌డంతో కొన్నాళ్లుగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు త‌గ్గించారు. అంతేకా దు.. త‌ర‌చుగా ఏపీలో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా మొంథా తుఫాను కార‌ణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు , అదేవిధంగా మ‌త్స్య‌కారులు కూడా తీవ్రంగా న‌ష్ట‌పోయారు. వీరిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బ‌రిలో ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. మొత్తంగా స‌ర్కారు వైపు నుంచి బాగానే ప‌నిచేస్తున్నార‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన కితాబే!.

మ‌రి అంతా బాగానే చేస్తున్నార‌ని అనుకున్నారో.. లేక త‌మ అవ‌స‌రం లేద‌ని భావించారో తెలియ‌దు కానీ.. ష‌ర్మిల తాజాగా త‌లెత్తిన తుఫాను అంశాల‌పై ఎక్క‌డ స్పందించ‌లేదు. సాధార‌ణంగా గ‌త ఏడాది ఏలూరు లో ఎర్ర‌కాలువ పొంగిన‌ప్పుడు.. ష‌ర్మిల నేరుగా అక్క‌డ‌కు చేరుకున్నారు. వ‌ర‌ద‌లో మునిగిమ‌రీ రైతులు న‌ష్ట‌పోయార‌ని, వారిఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మ‌రి ఇప్పుడు ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తారా?  లేదా.. అనేది కాదు.. అస‌లు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవాలి క‌దా!.

బాధ‌ల్లో ఉన్న రైతాంగానికి అంతో ఇంతో సాయం చేసేందుకు కార్య‌క‌ర్త‌ల‌నైనా రంగంలోకి దింపాలి క‌దా. తాను స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించాలి క‌దా!… ఇలా.. అనేక ప్ర‌శ్న‌లు ష‌ర్మిల చుట్టూ తిరుగుతున్నాయి. కానీ, ఆమె ఎక్క‌డున్నారో.. పార్టీ నాయ‌కులు కూడా చెప్ప‌లేక పోతున్నార‌ట‌. ఇదిలావుంటే.. కాంగ్రెస్ త‌ర‌ఫున ర‌ఘువీరా రెడ్డి రైతుల‌ను ఆదుకుంటామ‌ని చెప్పారు. కానీ.. అస‌లు ష‌ర్మిల ఏమ‌య్యార‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న కూడా స‌మాధానం చెప్ప‌లేదు. సో.. మొత్తానికి ష‌ర్మిల ఎక్క‌డున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌.

This post was last modified on October 30, 2025 5:14 pm

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

33 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago