రాజకీయాల్లో పోటీ లేకుండా ఎక్కడా ఉండదు. చిన్నచితకా పార్టీలైనా పోటీ ఇస్తుంటాయి. ఇక ప్రధాన పార్టీల మధ్య పోరు, పోటీ ఎలానూ ఉంటుంది. కానీ చిత్రంగా రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపికి పోటీ లేకుండాపోయింది. అంతేకాదు, ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడు కూడా లేరు. దీంతో అధికార పార్టీ తరఫున చేసుకునేందుకు చాలా అవకాశం ఉంది.
మరి ఏం జరుగుతోంది?
గుంటూరు పార్లమెంటు స్థానంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ నాయకుడు ప్రస్తుతం ఆ పార్టీని వీడి వేరే పార్టీలో చేరారు. దీంతో ఇక్కడ వేరే నేత ఊసే లేకుండాపోయింది. ఇక ఇక్కడ నుంచి టీడీపీ తరఫున విజయాన్ని దక్కించుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన గ్రాఫ్ నియోజకవర్గంలో బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నా, పెమ్మసాని తరచుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. కీలక సమస్యలు, ప్రాజెక్టుల విషయంలో అందరినీ కలుపుకొని పోతున్నారు.
ఇక విజయవాడలోనూ దాదాపు ఇలానే పరిస్థితి కొనసాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన టీడీపీ మాజీ నేత, మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ అరంగేట్రం చేస్తారనీ అంటున్నా, ఇప్పట్లో ఆయన వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వైసీపీ మాట ఇక్కడ కూడా పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో వినిపించడం లేదు. టీడీపీ తరఫున విజయాన్ని దక్కించుకున్న చిన్ని పనులు చేస్తున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన విజయవాడ ఉత్సవ్కు మంచి పేరు వచ్చింది.
అయితే చిన్నపాటి వివాదాలు కొంత మేరకు సరిచేసుకుంటే, చిన్ని గ్రాఫ్ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే, ఈ రెండు టిడిపికి హాట్కేక్లుగానే ఉన్నాయని చెప్పాలి. 2014, 2019, 2024 ఎన్నికల్లో గుంటూరు, విజయవాడలను టీడీపీ దక్కించుకుంది. అంటే ఇప్పటి వరకు వైసీపీ ఇక్కడ పాగా వేయలేకపోయింది. ఇదే పంథాను కొనసాగిస్తే, పార్టీకిఇబ్బంది ఉండదని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీకి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండడం గమనార్హం.
This post was last modified on October 27, 2025 8:23 pm
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…
ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి…