Political News

తెలంగాణ దీదీ…కవిత కొత్త లుక్

దేశ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహిళా నేతలలో ఇందిరా గాంధీ మొదలు వైఎస్ షర్మిల వరకు ఎందరో ఉన్నారు. అయితే, తన సింప్లిసిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ నేతలు కొందరే ఉన్నారు. వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుంటారు. సాధారణ మధ్యతరగతి మహిళ మాదిరిగా చీరను ధరించే మమతను బెంగాళీ మహిళలు తమలో ఒకరిగా తమ దీదీగా భావిస్తుంటారు. మధ్యతరగతి మహిళల్లో ఒకరేమో అన్నట్లుగా దీదీ వస్త్రధారణ చాలా సాదాసీదాగా ఉంటుంది. జడ కొప్పుతో పెద్దమనిషి తరహాలో ఉండే దీదీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

అందుకేనేమో, వస్త్రధారణలో దీదీని బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన సందర్భంగా కవిత కొత్త లుక్ పై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. మమతా బెనర్జీ, దివంగత బీజేపీ నేత సుష్మా స్వరాజ్ లను పోలి ఉండేలా కవిత వస్త్రధారణ, కట్టుబొట్టు ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి, ఈ కొత్త లుక్ ను కవిత కంటిన్యూ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

Satya

Recent Posts

బోరింగ్ అన్నారు… కోట్లు ఇచ్చేస్తున్నారు

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…

27 minutes ago

అడ్రస్ లేని సినిమా గురించి మెగా హీరో ఏమన్నాడు?

సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…

48 minutes ago

బంగారం లాంటి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది

పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…

1 hour ago

మరి సురేందర్ రెడ్డి సంగతేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…

3 hours ago

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

4 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

6 hours ago