Political News

విరాళాల్లో వెనుకబడ్డ బీఆర్ఎస్

రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నప్పుడు దక్కినంత ప్రాధాన్యత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొరకదు. పవర్ లో ఉన్న పొలిటిషియన్స్ కు ప్రజలు మొదలు పారిశ్రామికవేత్తలకు వరకు అందరూ ఇచ్చే వ్యాల్యూనే వేరు. అయితే, ఈ ఫార్ములా కేవలం రాజకీయ నేతలకే కాదు…రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. 2024-25కు గానూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలే ఇందుకు నిదర్శనం.

టీఆర్ఎస్…ఆ తర్వాత బీఆర్ఎస్..పదేళ్లపాటు తెలంగాణలో పాలన కొనసాగించింది. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పదేళ్లపాటు నగదు రూపంలో అయితేనేమి, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అయితేనేమీ భారీగా విరాళాలు వచ్చాయి. బెల్లం చుట్టు ఈగలు అన్న రీతిలో అధికారంలో ఉన్నంత కాలం ‘గులాబీ’ పార్టీ విరాళాలను బాగానే రాబట్టుకోగలిగింది. 2023-24 కాలంలో దాదాపు 580 కోట్ల రూపాయల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయి.

కానీ, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మారిపోయింది. 2024-25కు గానూ ఆ పార్టీకి వచ్చిన విరాళాలు కేవలం 15.09 కోట్లు మాత్రమే అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ, అదే వాస్తవమని ఈసీకి ఆ పార్టీ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే విరాళాలు 97 శాతం తగ్గాయి. ఈ రేంజ్ లో విరాళాలు తగ్గడం శోచనీయం.

ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 5 కోట్లు, ఎస్.రాజేందర్ రెడ్డి ఇచ్చిన విరాళం 8.79 లక్షలు, అజార్ ఇచ్చిన విరాళం 29వేలు…వెరసి మొత్తం రూ.15.09 కోట్లు. విరాళాలు రాబట్టడంలో బీఆర్ఎస్ ఇలా డీలా పడడంతో గులాబీ నేతలు దిగాలుగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి పునర్వైభవాన్ని సంతరించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆ ఫలితాల తర్వాత అయినా ఆ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతాయేమో వేచి చూడాలి.

This post was last modified on October 27, 2025 7:29 pm

Share
Show comments
Published by
Kumar
Tags: BRS

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

56 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago