రాష్ట్రంలో రాజకీయ మంటలు రేపిన తిరువూరు ఎమ్మెల్యే, ఎస్సీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అబుదాబీ పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్రంలో వర్షాలు.. వరదల పరిస్థితిపై ప్రతి రెండు గంటలకు ఒకసారి.. అధికారులతో ఫోన్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా తెరమీదికి వచ్చిన.. కొలిక పూడి వ్యవహారంపైనా ఆయన స్పందించారు.
“దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నా. దీని వెనుక ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? ఆయన ఎవరి వలలో చిక్కుకున్నారు. ఉద్దేశ పూర్వకంగా చేస్తే.. కఠిన చర్యలకు వెనుకాడను. తక్షణమే నాకు నివేదిక అందించండి. అందించాలి“ అని పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు కొలికపూడి వ్యవహారం మరింత ముదిరింది. తన వాట్సాప్ స్టేటస్లో ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి `వాడు-వీడు` అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. గురువారం సాయంత్రం నుంచి ఆయన వరుసగా స్టేటస్లు పెడుతూనే ఉన్నారు. తొలుత తనకు టికెట్ ఇవ్వలేదని.. అమ్మారని పేర్కొన్న ఆయన.. దీనికి సంబంధించి తాను బదిలీ చేసిన నగదు వివరాలతో బ్యాంకు స్టేట్ మెంట్ పెట్టారు. తర్వాత.. వైసీపీ నాయకులతో కేశినేనిని బంధం ఉందంటూ.. ఓ వీడియోను జత చేశారు. అనంతరం.. “ఎవరు బడితే వాడు.. ఎప్పుడు బడితే అప్పుడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్కు కాదు“ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పైగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చి.. మిగిలిన విషయాలు చెబుతానంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని పార్టీని ఆదేశించారు. దీనిని బట్టి.. ఏక్షణమైనా.. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…