రాష్ట్రంలో రాజకీయ మంటలు రేపిన తిరువూరు ఎమ్మెల్యే, ఎస్సీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అబుదాబీ పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్రంలో వర్షాలు.. వరదల పరిస్థితిపై ప్రతి రెండు గంటలకు ఒకసారి.. అధికారులతో ఫోన్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా తెరమీదికి వచ్చిన.. కొలిక పూడి వ్యవహారంపైనా ఆయన స్పందించారు.
“దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నా. దీని వెనుక ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? ఆయన ఎవరి వలలో చిక్కుకున్నారు. ఉద్దేశ పూర్వకంగా చేస్తే.. కఠిన చర్యలకు వెనుకాడను. తక్షణమే నాకు నివేదిక అందించండి. అందించాలి“ అని పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు కొలికపూడి వ్యవహారం మరింత ముదిరింది. తన వాట్సాప్ స్టేటస్లో ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి `వాడు-వీడు` అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. గురువారం సాయంత్రం నుంచి ఆయన వరుసగా స్టేటస్లు పెడుతూనే ఉన్నారు. తొలుత తనకు టికెట్ ఇవ్వలేదని.. అమ్మారని పేర్కొన్న ఆయన.. దీనికి సంబంధించి తాను బదిలీ చేసిన నగదు వివరాలతో బ్యాంకు స్టేట్ మెంట్ పెట్టారు. తర్వాత.. వైసీపీ నాయకులతో కేశినేనిని బంధం ఉందంటూ.. ఓ వీడియోను జత చేశారు. అనంతరం.. “ఎవరు బడితే వాడు.. ఎప్పుడు బడితే అప్పుడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్కు కాదు“ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పైగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చి.. మిగిలిన విషయాలు చెబుతానంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని పార్టీని ఆదేశించారు. దీనిని బట్టి.. ఏక్షణమైనా.. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on October 23, 2025 9:23 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…