Political News

ఏం స్టామినా బాబూ.. సోషల్ మీడియాలో ప్రశంసలు..!

ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత సాధారణంగా ఎవరైనా అలసిపోవడం సహజం. ఎంత విమానంలో ప్రయాణించినా అలుపు సొలుపు అనేది కచ్చితంగా వస్తుంది. వెంటనే విశ్రాంతి మందిరాలకు వెళ్తారు. ఒక గంట, రెండు గంటలు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది సహజంగా జరిగేది. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా నవయువకుడిలాగా వ్యవహరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా, ఆసక్తిగా కూడా మారింది.

సీఎం చంద్రబాబు తాజాగా బుధవారం హైదరాబాద్ నుంచి దుబాయ్ పర్యటనకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. దీనికి ముందు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలకి ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా భీమవరం లో జరిగిన డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డీజీపీ, అలాగే హోంమంత్రి అనితతో ఆయన చర్చలు జరిపారు. ఇది ముగిసిన వెంటనే అటునుంచే కారెక్కి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ కి బయలుదేరారు. ఈ మొత్తం ప్రయాణం సుమారు ఎనిమిది గంటలకు పైగానే పట్టిందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇంత శ్రమ తీసుకున్న తర్వాత సహజంగా ఒక ఐదు నిమిషాలైనా, పది నిమిషాలైనా కనీసం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏ వ్యక్తికైనా ఉంటుంది. కానీ, ఈ విషయంలో సీఎం చంద్రబాబు అసలు ఎక్కడా రెస్ట్ లేకుండా విమానంలోనే తనతో పాటు దుబాయ్ కి ప్రయాణం చేసిన మంత్రులు టీజీ భరత్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డిలతో చర్చలు జరిపారు.

విమానంలో నుంచే ఆయన అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఆయనతో ఉన్న అధికారులను ఆయన కొన్ని విషయాలపై బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. అనంతరం దుబాయ్ కి చేరుకున్న వెంటనే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించడం, ఆయనను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడ అలసట అన్న ఛాయలు కూడా ఆయన ముఖంలో కనిపించలేదు.

అంతేకాదు, ఆ వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా ఒక హోటల్‌కు చేరుకున్నారు. పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా మరో నాలుగు గంటల పాటు సాగాయి. రాష్ట్రానికి పెట్టుబడులు కోసం ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు పెట్టుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే.

అయితే ఇంత బిజీ షెడ్యూల్ ను ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎక్కడా అలసట లేని జీవితాన్ని ఆయన ఎలా నెట్టుకొస్తున్నారు అన్నది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో వైసిపి అధినేత జగన్ కూడా దుబాయ్ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల కోసం ఆ దేశంలో పర్యటించారు. కానీ, జగన్ విమానం ప్రయాణం చేసిన తర్వాత ఆ రోజు అక్కడ రెస్ట్ తీసుకొని తెల్లవారికి పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. ఈ వార్తలు అప్పట్లోనే వచ్చాయి.

ఆయనతో పోల్చుకున్నప్పుడు చంద్రబాబులో ఇంత స్టామినా ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా పనిచేస్తున్నారు అన్నదే సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మరి దీనిపై చంద్రబాబు ఏమంటారు అనేది చూడాలి. దీనిని టిడిపి నాయకులు అయితే స్వాగతిస్తున్నారు. 75 ఏళ్ల వయసులో ఉన్న 25 ఏళ్ల యువకుడు అని వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

This post was last modified on October 23, 2025 7:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

3 hours ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

3 hours ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

3 hours ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

4 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

5 hours ago

దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ‌

ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ప‌రిస్థితీ అంత బాగా లేదు. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. జ‌నాలు థియేట‌ర్ల‌కు…

6 hours ago