Political News

మీకు సొంత ఇల్లు లేదా.. చంద్ర‌బాబు చ‌క్క‌ని ఛాన్స్‌!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా ప్ర‌జ‌ల మ‌ధ్యకు కూడా వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. నెల‌నెలా.. 1వ తేదీన ప్ర‌జ‌ల మ‌ధ్య‌కురావ‌డంతోపాటు.. వారి స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న దృష్టి పెడుతున్నారు. ఈ క్ర‌మంలో త‌ర‌చుగా ఆయ‌న వినిపిస్తున్న మాట‌.. త‌మ‌కు సొంత ఇల్లు లేద‌నే!. ఇదే విష‌యంపై పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌లోనూ ప్ర‌జ‌లు విన్నవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద‌ల కోసం.. కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సొంత ఇల్లు లేని వారి కోసం.. ప్ర‌భుత్వం చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పిస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల‌తో పాటు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సొంత‌ ఇళ్లు లేని మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద కుటుంబాలకు కేంద్రం స‌హ‌కారంతో సొంత ఇల్లు నిర్మించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ, ప‌ట్ట‌ణ పథకాల కింద‌.. రాష్ట్రంలోని పేద‌లు, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి సొంత గూడు ఏర్పాటు చేసి ఇవ్వ‌నుంది.

రాష్ట్రంలోని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలను గుర్తించేందుకు కేంద్ర గృహనిర్మాణశాఖ చేపట్టిన ఈ సర్వే గడువు దేశవ్యాప్తంగా రెండు నెలల క్రితమే ముగిసింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల మందికిపైగా పేదలు ఇళ్లు లేకుండా ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల నివేదించారు. దీనిపై స్పందించిన సీఎం..వెంటనే కేంద్రానికి లేఖ రాశారు. దీంతో తాజాగా కేంద్రం స్పందించింది. ఏపీ చేప‌ట్టిన సర్వేకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది.

కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు పేద‌లు, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల్లోని వారికి నవంబర్ 5 వరకు గడువిచ్చింది. అర్హులెవరైనా ఉంటే గృహనిర్మాణశాఖ ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆదాయ‌ప‌న్ను చెల్లించ‌ని దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు కూడా అర్హులే. వారికి ఎక్క‌డా సొంత ఇల్లు ఉండ‌కూడ‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు రుణం కూడా తీసుకుని ఉండ కూడ‌దు. అదేవిధంగా వార‌స‌త్వంగా వ‌చ్చిన ఇళ్ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇవేవీ మీకు వ‌ర్తించ‌క‌పోతే.. ఇంకెందుకు ఆల‌స్యం.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

This post was last modified on October 22, 2025 10:31 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

2 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

2 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

3 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

6 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

7 hours ago