ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై ఆయన పరోక్షంగా విరుచుకుపడ్డారు. `వారంతా నయా నరకాసురులు` అని పేర్కొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.. నయా నరకాసురులను ప్రజలు ప్రజాస్వామ్య యుద్ధంలో మట్టుబెట్టారని అన్నారు. అయినా.. కొన ప్రాణంతో ఉన్న వారు.. ఇంకా అరాచకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నారని తెలిపారు.
కులాలు, మతాలకు మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. వైసీపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారి విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. దీపావళి పండుగ వేళ కూడా.. వివాదాలకు తెరదీసే పనులు చేస్తున్నారని.. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే వారికి ఇష్టం ఉండదని.. ఎప్పుడూ రావణ కాష్ఠంగా మండాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోని కందుకూరులో జరిగిన ఘటనను పరోక్షంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని.. భావిస్తున్నారని అన్నారు.
కానీ, ప్రజలకు అన్నీ తెలుసునన్న పవన్ కల్యాణ్.. వారు రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. దీపావళి రోజు ప్రజలు హరిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం పర్యావరణం చాలా కీలకంగా మారిందన్న ఆయన ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలంటే పర్యావరణం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హరిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీపావళి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on October 19, 2025 7:34 pm
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ…
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు…
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…