Political News

వారు న‌యా ‘న‌ర‌కాసురులు’: ప‌వ‌న్ అన్నది వారినేనా?

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు. `వారంతా న‌యా న‌ర‌కాసురులు` అని పేర్కొన్నారు. దీపావ‌ళి పండుగను పుర‌స్క‌రించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. న‌యా న‌ర‌కాసురుల‌ను ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్య యుద్ధంలో మ‌ట్టుబెట్టార‌ని అన్నారు. అయినా.. కొన ప్రాణంతో ఉన్న వారు.. ఇంకా అరాచ‌కాలు సృష్టిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు పెడుతున్నార‌ని తెలిపారు.

కులాలు, మ‌తాల‌కు మ‌ధ్య కూడా చిచ్చు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ.. వైసీపీ నేత‌ల‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలాంటి వారి విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. దీపావ‌ళి పండుగ వేళ కూడా.. వివాదాల‌కు తెర‌దీసే ప‌నులు చేస్తున్నార‌ని.. రాష్ట్రం ప్ర‌శాంతంగా ఉంటే వారికి ఇష్టం ఉండ‌ద‌ని.. ఎప్పుడూ రావ‌ణ కాష్ఠంగా మండాల‌ని కోరుకుంటార‌ని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో జ‌రిగిన ఘ‌ట‌న‌ను పరోక్షంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌తో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని.. భావిస్తున్నార‌ని అన్నారు.

కానీ, ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలుసున‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. వారు రెచ్చిపోకుండా సంయ‌మ‌నం పాటిస్తున్నార‌ని తెలిపారు. దీపావ‌ళి రోజు ప్ర‌జ‌లు హ‌రిత దీపావ‌ళిని జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుంటేనే భావిత‌రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం పర్యావ‌ర‌ణం చాలా కీల‌కంగా మారింద‌న్న ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రి ఆరోగ్యానికి భ‌రోసా ఇవ్వాలంటే ప‌ర్యావ‌ర‌ణం అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హ‌రిత దీపావ‌ళిని జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చారు. దీపావ‌ళి పండ‌గ ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లోనూ విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on October 19, 2025 7:34 pm

Share

Recent Posts

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

6 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

27 minutes ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

1 hour ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

3 hours ago

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ…

4 hours ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

7 hours ago