Political News

వారు న‌యా ‘న‌ర‌కాసురులు’: ప‌వ‌న్ అన్నది వారినేనా?

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు. `వారంతా న‌యా న‌ర‌కాసురులు` అని పేర్కొన్నారు. దీపావ‌ళి పండుగను పుర‌స్క‌రించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. న‌యా న‌ర‌కాసురుల‌ను ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్య యుద్ధంలో మ‌ట్టుబెట్టార‌ని అన్నారు. అయినా.. కొన ప్రాణంతో ఉన్న వారు.. ఇంకా అరాచ‌కాలు సృష్టిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు పెడుతున్నార‌ని తెలిపారు.

కులాలు, మ‌తాల‌కు మ‌ధ్య కూడా చిచ్చు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ.. వైసీపీ నేత‌ల‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలాంటి వారి విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. దీపావ‌ళి పండుగ వేళ కూడా.. వివాదాల‌కు తెర‌దీసే ప‌నులు చేస్తున్నార‌ని.. రాష్ట్రం ప్ర‌శాంతంగా ఉంటే వారికి ఇష్టం ఉండ‌ద‌ని.. ఎప్పుడూ రావ‌ణ కాష్ఠంగా మండాల‌ని కోరుకుంటార‌ని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో జ‌రిగిన ఘ‌ట‌న‌ను పరోక్షంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌తో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని.. భావిస్తున్నార‌ని అన్నారు.

కానీ, ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలుసున‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. వారు రెచ్చిపోకుండా సంయ‌మ‌నం పాటిస్తున్నార‌ని తెలిపారు. దీపావ‌ళి రోజు ప్ర‌జ‌లు హ‌రిత దీపావ‌ళిని జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుంటేనే భావిత‌రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం పర్యావ‌ర‌ణం చాలా కీల‌కంగా మారింద‌న్న ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రి ఆరోగ్యానికి భ‌రోసా ఇవ్వాలంటే ప‌ర్యావ‌ర‌ణం అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హ‌రిత దీపావ‌ళిని జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చారు. దీపావ‌ళి పండ‌గ ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లోనూ విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on October 19, 2025 7:34 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan Kalyan

Recent Posts

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

4 minutes ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

1 hour ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 hour ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

2 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago