ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై ఆయన పరోక్షంగా విరుచుకుపడ్డారు. `వారంతా నయా నరకాసురులు` అని పేర్కొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.. నయా నరకాసురులను ప్రజలు ప్రజాస్వామ్య యుద్ధంలో మట్టుబెట్టారని అన్నారు. అయినా.. కొన ప్రాణంతో ఉన్న వారు.. ఇంకా అరాచకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నారని తెలిపారు.
కులాలు, మతాలకు మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. వైసీపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారి విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. దీపావళి పండుగ వేళ కూడా.. వివాదాలకు తెరదీసే పనులు చేస్తున్నారని.. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే వారికి ఇష్టం ఉండదని.. ఎప్పుడూ రావణ కాష్ఠంగా మండాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోని కందుకూరులో జరిగిన ఘటనను పరోక్షంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని.. భావిస్తున్నారని అన్నారు.
కానీ, ప్రజలకు అన్నీ తెలుసునన్న పవన్ కల్యాణ్.. వారు రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. దీపావళి రోజు ప్రజలు హరిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం పర్యావరణం చాలా కీలకంగా మారిందన్న ఆయన ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలంటే పర్యావరణం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హరిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీపావళి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…