జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఖరారైంది. నిన్న మొన్నటి వరకు తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ సీటు విషయంపై ఎట్టకేలకు కమల నాథులు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం దీపక్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో దీపక్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయించారు.
దీపక్ రెడ్డి బీజేపీలో చాలా కాలం నుంచే ఉన్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయలకు అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, అన్ని పార్టీల్లోనూ ఆయనకు మిత్రులు ఉన్నారని అంటారు. ఆర్థికంగా కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. మరోవైపు ఈ స్థానం నుంచి ముగ్గురు బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
అయితే, ఆది నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి విషయమే చర్చకు వచ్చింది. కేంద్రంలో తెలంగాణ తరఫున చక్రం తిప్పుతున్న కిషన్ రెడ్డి దీపక్ రెడ్డికే మద్దతు ఇస్తున్నారన్న వాదన వినిపించింది. అయితే, గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన నేపథ్యంలో దీపక్ రెడ్డికి ఈ సారి ఇవ్వబోరని కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మహిళా నాయకురాళ్లకు అవకాశం దక్కుతుందని అనుకున్నారు.
కానీ, చివరి నిమిషం వరకు వేచి చూసిన పార్టీ పెద్దలు కిషన్ రెడ్డి నిర్ణయానికి ఆమోదం తెలిపారని తెలుస్తోంది. కాగా, దీపక్ రెడ్డి 2023లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. అయితే, ఆయన 25 వేల ఓట్లు మాత్రమే రాబట్టగలిగారు. దీంతో డిపాజిట్ కూడా దక్కలేదు. మరోవైపు, ప్రస్తుతం సెంటిమెంటు పాలిటిక్స్ నేపథ్యంలో ఆయన ఏమేరకు విజయం దక్కించుకుంటారో చూడాలి.
This post was last modified on October 15, 2025 5:38 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…