Political News

ఏపీలో గూగుల్ AI హబ్: ఊహించని పెట్టుబడి

భారతదేశంలో టెక్నాలజీ రంగానికి ఊపునిచ్చే అతిపెద్ద ప్రకటన ఇది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో ఏకంగా $15 బిలియన్లు (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపిన గూగుల్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (వైజాగ్‌లో) తమ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను ఏర్పాటు చేయనుంది.

అమెరికా వెలుపల గూగుల్ ఇంత పెద్ద AI హబ్‌ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక, AI సర్వీసులకు ఇండియాలో పెరుగుతున్న భారీ డిమాండ్ ప్రధాన కారణం. ఈ AI హబ్‌లో భాగంగా, విశాఖపట్నం పోర్ట్ సిటీలో 1 గిగావాట్ డేటా సెంటర్ కాంపస్‌ను గూగుల్ నిర్మించనుంది.

AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భారీస్థాయిలో ఎనర్జీ సోర్సులు, విస్తృతమైన ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ పెట్టుబడితో ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా. ఈ కీలకమైన ఒప్పందం ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్‌లో కుదిరింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. నిజానికి, ప్రపంచ టెక్ కంపెనీల మధ్య ఇప్పుడు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీవ్రమైన పోటీ నడుస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలకు ఇండియా ఒక ముఖ్యమైన గ్రోత్ మార్కెట్‌గా మారింది. దేశంలో దాదాపు వంద కోట్ల మంది ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు కూడా ఇండియాలో ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి తమ డేటా సెంటర్లను నిర్మించాయి.

అయితే, గూగుల్ చేసిన ఈ $15 బిలియన్ల పెట్టుబడి ప్రకటన.. దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. కేవలం డేటా సెంటర్లకు మాత్రమే కాకుండా, ఏపీని AI పరిశోధనలు టెక్నాలజీ డెవలప్‌మెంట్ కోసం ఒక గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి గూగుల్ ఈ హబ్‌ను వాడుకునే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ భారీ పెట్టుబడి ప్రకటన ఇండియాలో డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టెక్నాలజీ మ్యాప్‌లో ఒక ప్రత్యేక స్థానం లభించినట్లయింది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు, టెక్ పరిశ్రమకు ఒక పెద్ద బూస్ట్‌గా నిలవనుంది.

This post was last modified on October 14, 2025 1:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

10 minutes ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

1 hour ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

1 hour ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

2 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago