విజయ్ దేవరకొండ తమ్ముడు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కెరీర్ ఆరంభంలో సరైన బ్రేక్ అందక ఇబ్బంది పడ్డాడు ఆనంద్ దేవరకొండ. ఐతే అతడికి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఆపై ‘బేబీ’ మూవీతో అతడికి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. కానీ తర్వాత మళ్లీ కెరీర్లో గ్యాప తప్పలేదు.
బేబీ మేకర్స్తో అనుకున్న సినిమాకు బ్రేక్ పడి వేరే హీరో చేతుల్లోకి వెళ్లిపోగా.. కొంచెం గ్యాప్ తర్వాత ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్తో ఓ సినిమా చేస్తున్నాడు. అది చాలా వరకు లండన్లో షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే ఆ చిత్రం పూర్తి కానుంది. ఈలోపు ఆనంద్ హీరోగా ఒక ఓటీటీ సినిమా తెరపైకి వచ్చింది. ఆ చిత్రానికి ‘తక్షకుడు’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. ఈ రోజే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆ చిత్రాన్ని అనౌన్స్ చేసింది.
అగ్గిలా మండుతున్న గన్నును పట్టుకున్న నక్సలైట్ లుక్తో ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా కనిపించింది ‘తక్షకుడు’లో. దీనికి ‘వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు’ అనే క్యాప్షన్ జోడించారు. బహుశా ఇందులో అన్యాయానికి బలయ్యే అమాయకుడి పాత్రలో ఆనంద్ కనిపించనున్నాడేమో. అందుకే ఈ క్యాప్షన్ పెట్టారేమో. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
సితార సంస్థ నుంచి వచ్చే సినిమా ఈ రోజుల్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఎందుకు ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావట్లేదో మరి. ఆనంద్కు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో బ్రేక్ ఇచ్చిన వినోద్ అనంతోజునే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. ఇందులో బాలీవుడ్ క్లాసిక్ ‘లాపతా లేడీస్’తో మంచి పేరు సంపాదించిన నితాంశి గోయెల్ కథానాయికగా నటించింది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.
This post was last modified on October 14, 2025 12:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…