విజయ్ దేవరకొండ తమ్ముడు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కెరీర్ ఆరంభంలో సరైన బ్రేక్ అందక ఇబ్బంది పడ్డాడు ఆనంద్ దేవరకొండ. ఐతే అతడికి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఆపై ‘బేబీ’ మూవీతో అతడికి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. కానీ తర్వాత మళ్లీ కెరీర్లో గ్యాప తప్పలేదు.
బేబీ మేకర్స్తో అనుకున్న సినిమాకు బ్రేక్ పడి వేరే హీరో చేతుల్లోకి వెళ్లిపోగా.. కొంచెం గ్యాప్ తర్వాత ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్తో ఓ సినిమా చేస్తున్నాడు. అది చాలా వరకు లండన్లో షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే ఆ చిత్రం పూర్తి కానుంది. ఈలోపు ఆనంద్ హీరోగా ఒక ఓటీటీ సినిమా తెరపైకి వచ్చింది. ఆ చిత్రానికి ‘తక్షకుడు’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. ఈ రోజే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆ చిత్రాన్ని అనౌన్స్ చేసింది.
అగ్గిలా మండుతున్న గన్నును పట్టుకున్న నక్సలైట్ లుక్తో ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా కనిపించింది ‘తక్షకుడు’లో. దీనికి ‘వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు’ అనే క్యాప్షన్ జోడించారు. బహుశా ఇందులో అన్యాయానికి బలయ్యే అమాయకుడి పాత్రలో ఆనంద్ కనిపించనున్నాడేమో. అందుకే ఈ క్యాప్షన్ పెట్టారేమో. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
సితార సంస్థ నుంచి వచ్చే సినిమా ఈ రోజుల్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఎందుకు ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావట్లేదో మరి. ఆనంద్కు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో బ్రేక్ ఇచ్చిన వినోద్ అనంతోజునే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. ఇందులో బాలీవుడ్ క్లాసిక్ ‘లాపతా లేడీస్’తో మంచి పేరు సంపాదించిన నితాంశి గోయెల్ కథానాయికగా నటించింది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.
This post was last modified on October 14, 2025 12:56 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…