Political News

‘జోగి రమేశే నకిలీ లిక్కర్ తయారు చేయమన్నారు’

గత వారం పది రోజులుగా ఏపీని కుదిపేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మద్యం తయారు చేస్తున్న కీలక నిందితుడు కేసులో ఏ-1గా ఉన్న జనార్దన్‌రావు తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశే తమతో నకిలీ మద్యం తయారు చేయిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఆయన ఆదేశాల మేరకే తాము తంబళ్లపల్లి నియోజకవర్గంలో నకిలీ లిక్కర్ తయారీకి డంప్ ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. అదేవిధంగా మార్కెటింగ్ వ్యవహారాలను కూడా జోగి అనుచరులకు ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు.

“రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిఘా పెరిగింది. పైగా తక్కువ ధరలకే మద్యం అందుబాటులోకి తెచ్చారు. 100 రూపాయలకే లిక్కర్ అందుబాటులోకి వచ్చాక నకిలీ మద్యం అవసరం లేదు. అందుకే మేము మౌనంగా ఉన్నాం. అయితే గత ఏప్రిల్‌లో మాజీ మంత్రి జోగి రమేష్ నాకు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావని అడిగారు. మద్యం తయారీలో ఉన్నావా అని ప్రశ్నించారు. లేనని చెప్పా. అనంతరం ఆయన మళ్లీ నువ్వు పనిలోకి దిగాలి, అవసరమైతే పెట్టుబడి ఇస్తాను అన్నారు. ఆ వెంటనే ఆయన ఇంటికి సమీపంలోనే ఇబ్రహీంపట్నం (విజయవాడ శివారు)లో తయారీ చేపట్టాం” అని జనార్దన్‌రావు వివరించినట్టు పోలీసులు తెలిపారు.

ఇక ఆ తర్వాత ఎక్కడ నుంచి వ్యాపారం ప్రారంభించాలన్న విషయంపైనా జోగి సూచనలు చేశారని చెప్పారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి అయితే కరెక్ట్ అని, అది చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఆ ప్రాంతం నుంచి చేపట్టాలని జోగి సూచించినట్టు జనార్దన్ వివరించారు. తద్వారా ఈ విషయాన్ని బయట పెడితే చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ వస్తుందని, పార్టీ వ్యూహంలో భాగంగా తామే ఒక రోజు ముందుగా సమాచారం ఇస్తామన్నారు. అయితే ఇంతలోనే పోలీసులు తమను పట్టుకున్నట్టు వివరించారు. ఈ మొత్తం వ్యవహారం నుంచి తాము తప్పుకున్నామని, అప్పట్లో వైసీపీ వారికి కూడా కొన్ని వాటాలు అందించారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వెనుక జోగి రమేష్ పాత్ర కీలకంగా ఉందన్నారు.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

1 hour ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

4 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

4 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

5 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

8 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

9 hours ago