జనసేన-టీడీపీ పొత్తుపై కీలక సంచలన వ్యవహారం.. ప్రభావం చూపించనుందా? టీడీపీకి చెందిన యువ నాయకుడు తొలి సారి విజయం దక్కించుకున్న బొజ్జల సుదీర్ రెడ్డి వ్యవహారం.. మంట పెడుతోందా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. దీనికి తోడు వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా.. జనసేన- టీడీపీలను కుదిపేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ సెల్ఫీ వీడియో.. మరింతగా జనసేన వర్గాలను కుదిపేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీమకు చెందిన జనసేన నాయకులు పట్టు బడుతున్నట్టు తెలిసింది.
ఏం జరిగింది?
శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్.. కోట వినుతి.. ఇటీవల తన కారు డ్రైవర్ హత్య కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ.. జనసేన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వినుతి మాత్రం తాను జనసేనతోనే ఉన్నానని.. ఉంటానని కూడా చెబుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరించినా.. ఆమె కండువా మాత్రం వదల కుండా పలు సమస్యలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసిన కారు డ్రైవర్.. రాయుడు వీడియో.. సంచలనంగా మారింది.
వినుతి ప్రైవేటు వీడియోలను తనకు తీసుకువచ్చి ఇస్తే.. 30-60 లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని రాయుడు ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. తీసుకురాకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. ఇదే.. అతని హత్యకు దారి తీసిందన్నది స్పష్టమ వుతోంది. నిజానికి అప్పట్లోనే ఈ విషయం చర్చకు వచ్చినా.. జనసేన వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు.. టీడీపీ కూడా.. ఎమ్మెల్యే బొజ్జలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఈ పరిణామాల క్రమంలోనే వినుతిపై జనసేన బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. తాజా వీడియోతో .. తన తప్పులేదని వినుతి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇదేసమయంలో సుధీర్ ప్రోద్బలంతో తనకు సంబంధించిన వీడియోలను ఎమ్మెల్యే తీసుకోవాలని భావించారని కూడా ఆమె చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వ్యవహారం అంతా కూడా.. ఎమ్మెల్యే చుట్టూ చేరింది. అంతేకాదు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలన్నది జనసేన వర్గాలు చెబుతున్న మాట. మరోవైపు.. పవన్ మౌనంగా ఉంటే కుదరదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 13, 2025 11:41 am
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…
తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి…