Political News

`అమ‌రావ‌తి` ప‌నులా.. ఇక‌, చిటెక‌లో!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించిన ప‌నులు పూర్త‌వ్వాలంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌యాస‌లు ప‌డాల్సి వ‌స్తోంద‌న్న‌ది వాస్త‌వం. ప్ర‌ధాన కార్యాల‌యాల‌న్నీ.. త‌లా ఒకచోట ఉండ‌డంతో అమ‌రావ‌తిలో భూములు కొనాలన్నా.. విక్ర‌యించాల‌న్నా.. ఆయా కార్యాల‌యాల చుట్టూ తిరిగే ప‌రిస్థితి ఉంది. దీంతో ప‌నులు స‌కాలంలో పూర్తి కావ‌డం లేద‌న్న‌ది కూడా వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు కొన్నాళ్లుగా.. చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. తాజాగా అమ‌రావ‌తిలోనే అన్నీ అయ్యేట్టుగా కార్యాల‌యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఏపీ పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ప్ర‌ధాన కార్యాలయాన్ని అమ‌రావ‌తిలోని రాయ‌పూడిలో ఏర్పాటు చేశారు. దీనిని సీఎం చంద్ర‌బాబు ఈనెల 13న‌(సోమ‌వారం) ప్రారంభించ‌నున్నారు. ఫ‌లితంగా రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించిన అన్ని ప‌నులు, కార్య‌క‌లాపాలు ఇక్క‌డ నుంచే జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌జా రాజ‌ధానిలో పాల‌నా సౌల‌భ్యం కొరకు అన్ని హెచ్ వో డీలు ఒకే చోటకు చేర‌నున్నాయి. త‌ద్వారా ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా స‌రికొత్త హంగుల‌తో నిర్మించిన భ‌వ‌నాల నుంచే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ముఖ్యంగా అమ‌రావ‌తికి భూములిచ్చిన‌ రైతులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు విజయవాడ‌, మంగ‌ళ‌గిరిలోని కార్యాల‌యాల చుట్టూ ప‌నులు మానుకుని రావాల్సి వ‌చ్చేంది. ఈ కార్యాల‌యం అందుబాటులోకి రావ‌డంతో వారు ఇక్క‌డే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌తిబింబించేలా భ‌వ‌నం ముందు `ఏ`అక్ష‌రంతో ఎలివేష‌న్ చేశారు.

అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. వైసీపీ హ‌యాంలో ఆగిపోయినా.. ఇటీవ‌ల దీనిని పూర్తి చేశారు.  

మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనంగా రూపొందించిన ఈ నిర్మాణంలో పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. దీనిలోనే పుర‌పాల‌క శాఖ మంత్రి అందుబాటులో ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ, ఏడీసీఎల్ అధికారులు కూడా ఇక్క‌డ నుంచే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

6 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago