ప్రపంచ శాంతి దూతగా.. తనను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిద్రలేని రాత్రి వచ్చింది. గత రెండు, మూడు మాసాలుగాఆయన నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచంలో ఈ బహుమతికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. `ప్రపంచ శాంతి దూత`గా ఆవిర్భవించేందుకు.. నోబెల్ పురస్కారం అంత్యంత కీలకం. దీనిని తాను కైవసం చేసుకునేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు.. బెదిరింపులు కూడా అందరికీ తెలిసిందే. ఈ ఏడాది శాంతి బహుమతిని తన ఖాతాలో వేసుకునేందుకు చివరి నిముషం వరకు ప్రయత్నించారు. కానీ, ఈ దఫా శాంతి పురస్కారాన్ని వెనుజువెలా దేశానికి చెందిన వ్యక్తికి అందించనున్నారు.
వెనుజువెలా రాజకీయ నాయకురాలు మరియా కొరీనాను నోబెల్ శాంతి పురస్కారానికి తాజాగా ఎంపిక చేశారు. వాస్తవానికి కొరీనా.. వెనుజువెలా విపక్ష నాయకురాలు. అయితే.. జాతుల మధ్య వైరానికి, పేదలకు ఆపన్నహస్తం అందించేందుకు, ముఖ్యంగా అనాథల సేవకు ఎంతో ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా ప్రజలకు హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆమె అలుపెరుగని కృషి చేశారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి పురస్కార బృందం.. దీనిపై అనేక రూపాల్లో అధ్యయనం చేసి.. అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు సేకరించి.. చివరకు కొరీనాను ఎంపిక చేసింది.
ట్రంప్కు భారీ దెబ్బ!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. శాంతి పురస్కారంపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన నోబెల్పై కన్నేశారు. ఈ క్రమంలోనే ప్రపంచంలో 7 ప్రధాన యుద్ధాలను నిలువరించినట్టు చెప్పుకొచ్చారు. వీటిలో భారత్-పాక్ దేశాల మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్కూడా ఉందని ఆయన పదే పదే చెప్పారు. ఇక, ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలు కూడా ఉన్నాయి. వాటిని తాను సమర్థవంతంగా నిలుపుదల చేసి.. ప్రపంచానికిఎంతో మేలు చేశానని.. ఈ దఫా తనకే శాంతి పురస్కారం దక్కుతుందని ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. కానీ, ఆయనకు కాకుండా.. వెనుజువెలా విపక్ష నాయకురాలికి దక్కడం గమనార్హం.
ట్రంప్కు ఎందుకు ఇవ్వలేదు?
1) వాస్తవానికి నోబెల్ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏటా జనవరి 31వ తేదీ ఆఖరు. ఆలోగానే ఈ పురస్కారాలకు దరఖాస్తులు సమర్పించాలి. కానీ, ట్రంప్ ఆ తర్వాత.. శాంతి పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని నోబెల్ కమిటీ తెలిపింది.
2) దేశాల మధ్య శాంతిని ప్రతిపాదించే చర్యలు సమర్థనీయమే అయినా.. అవి బెదిరింపులు, హెచ్చరికలుగా కాకుండా.. చర్చలు, సుస్థిరమైన ప్రదిపాలనతో చేయాలి. ఈ విషయంలో ట్రంప్ బెదిరింపులకు దిగి.. ఆపారన్నది నోబెల్కమిటీ చెప్పిన మాట.
3) ట్రంప్పలు దేశాల మధ్య యుద్ధాలను నిలువరించినా.. అవి, శాశ్వతమా.. కాదా.. అనేది మరో 6 మాసాల తర్వాత కానీ తెలియదని.. కమిటీ అభిప్రాయపడింది. బెదిరింపులు, హెచ్చరికలతో యుద్ధాలను నిలుపుదల చేయడం అనేది ప్రపంచసుస్థిర శాంతికి దోహదపడదని పేర్కొంది. అందుకే.. ట్రంప్నకు ఇవ్వలేదని పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…