Political News

నోబెల్ ఎఫెక్ట్‌: ట్రంప్‌కు నిద్ర‌లేని రాత్రి!

ప్ర‌పంచ శాంతి దూత‌గా.. త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిద్ర‌లేని రాత్రి వ‌చ్చింది. గ‌త రెండు, మూడు మాసాలుగాఆయ‌న నోబెల్ శాంతి బ‌హుమ‌తిపై ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌పంచంలో ఈ బ‌హుమ‌తికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. `ప్ర‌పంచ శాంతి దూత‌`గా ఆవిర్భ‌వించేందుకు.. నోబెల్ పుర‌స్కారం అంత్యంత కీల‌కం. దీనిని తాను కైవ‌సం చేసుకునేందుకు ట్రంప్ చేసిన ప్ర‌య‌త్నాలు.. బెదిరింపులు కూడా అంద‌రికీ తెలిసిందే. ఈ ఏడాది శాంతి బ‌హుమ‌తిని త‌న ఖాతాలో వేసుకునేందుకు చివ‌రి నిముషం వ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. కానీ, ఈ ద‌ఫా శాంతి పుర‌స్కారాన్ని వెనుజువెలా దేశానికి చెందిన వ్య‌క్తికి అందించ‌నున్నారు.

వెనుజువెలా రాజ‌కీయ నాయ‌కురాలు మ‌రియా కొరీనాను నోబెల్ శాంతి పుర‌స్కారానికి తాజాగా ఎంపిక చేశారు. వాస్త‌వానికి కొరీనా.. వెనుజువెలా విప‌క్ష నాయ‌కురాలు. అయితే.. జాతుల మ‌ధ్య వైరానికి, పేద‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు, ముఖ్యంగా అనాథ‌ల సేవ‌కు ఎంతో ప్ర‌య‌త్నించారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు హ‌క్కులు, ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు ఆమె అలుపెరుగ‌ని కృషి చేశారు. దీంతో నోబెల్ శాంతి బహుమ‌తి పుర‌స్కార బృందం.. దీనిపై అనేక రూపాల్లో అధ్య‌య‌నం చేసి.. అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు సేక‌రించి.. చివ‌ర‌కు కొరీనాను ఎంపిక చేసింది.

ట్రంప్‌కు భారీ దెబ్బ‌!

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. శాంతి పుర‌స్కారంపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌త మూడు నాలుగు నెల‌లుగా ఆయ‌న నోబెల్‌పై క‌న్నేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచంలో 7 ప్ర‌ధాన యుద్ధాల‌ను నిలువ‌రించిన‌ట్టు చెప్పుకొచ్చారు. వీటిలో భార‌త్-పాక్ దేశాల మ‌ధ్య జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌కూడా ఉంద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెప్పారు. ఇక‌, ఉక్రెయిన్‌-ర‌ష్యా, ఇజ్రాయెల్‌-గాజా యుద్ధాలు కూడా ఉన్నాయి. వాటిని తాను స‌మ‌ర్థ‌వంతంగా నిలుపుద‌ల చేసి.. ప్ర‌పంచానికిఎంతో మేలు చేశాన‌ని.. ఈ ద‌ఫా త‌న‌కే శాంతి పుర‌స్కారం ద‌క్కుతుంద‌ని ట్రంప్ ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, ఆయ‌న‌కు కాకుండా.. వెనుజువెలా విప‌క్ష నాయ‌కురాలికి ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

ట్రంప్‌కు ఎందుకు ఇవ్వ‌లేదు?

1) వాస్త‌వానికి నోబెల్ పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. ఏటా జ‌న‌వ‌రి 31వ తేదీ ఆఖ‌రు. ఆలోగానే ఈ పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాలి. కానీ, ట్రంప్ ఆ త‌ర్వాత‌.. శాంతి పుర‌స్కారం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని నోబెల్ క‌మిటీ తెలిపింది.

2) దేశాల మ‌ధ్య శాంతిని ప్ర‌తిపాదించే చ‌ర్య‌లు స‌మ‌ర్థ‌నీయ‌మే అయినా.. అవి బెదిరింపులు, హెచ్చ‌రిక‌లుగా కాకుండా.. చ‌ర్చ‌లు, సుస్థిర‌మైన ప్ర‌దిపాల‌న‌తో చేయాలి. ఈ విష‌యంలో ట్రంప్ బెదిరింపుల‌కు దిగి.. ఆపార‌న్న‌ది నోబెల్‌క‌మిటీ చెప్పిన మాట‌.

3) ట్రంప్‌ప‌లు దేశాల మ‌ధ్య యుద్ధాల‌ను నిలువ‌రించినా.. అవి, శాశ్వ‌త‌మా.. కాదా.. అనేది మ‌రో 6 మాసాల త‌ర్వాత కానీ తెలియ‌ద‌ని.. క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌తో యుద్ధాల‌ను నిలుపుద‌ల చేయ‌డం అనేది ప్ర‌పంచ‌సుస్థిర శాంతికి దోహ‌ద‌ప‌డ‌ద‌ని పేర్కొంది. అందుకే.. ట్రంప్‌న‌కు ఇవ్వ‌లేద‌ని పేర్కొంది.

This post was last modified on October 10, 2025 7:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

1 hour ago

ప్యాన్ ఇండియా ‘డెవిల్’ టాక్ ఏంటి

మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…

2 hours ago

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

3 hours ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

3 hours ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

4 hours ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

6 hours ago