ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం స్నాతకోత్సవంలో ఆమె విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్షిప్లకు దూరంగా ఉండాలని గట్టిగా కోరారు. “ఈ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రెండ్గా మారింది, కానీ దానికి దూరంగా ఉండాలని నేను అమ్మాయిలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను” అని గవర్నర్ హెచ్చరించారు.
అంతటితో ఆగకుండా, ఆమె మరింత సంచలన కామెంట్స్ చేశారు. “లేదంటే, మహిళలను 50 ముక్కలుగా నరికిన వార్తలు మీరు చూసే ఉంటారు కదా,” అని గవర్నర్ నేరుగా హింసాత్మక సంఘటనలను ప్రస్తావించారు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వల్ల జరిగే దారుణమైన పరిణామాలను ప్రస్తావిస్తూ ఆమె ఈ విధంగా మాట్లాడారు. ఈ వార్తలు విన్నప్పుడల్లా తనకు చాలా బాధ కలుగుతోందని, “మన కూతుర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు?” అని ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపారు.
గవర్నర్ పటేల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. కేవలం రెండు రోజుల క్రితం బల్లియాలోని జననాయక్ చంద్రశేఖర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కూడా ఆమె లివ్ ఇన్ పరిణామాల గురించి మాట్లాడారు. ఆ అరేంజ్మెంట్స్కు సంబంధించిన ‘ఫలితాలు’ చూడాలనుకుంటే అనాథ శరణాలయాలను సందర్శించాలని ఆమె సూచించారు.
అక్కడ “15 నుంచి 20 ఏళ్ల అమ్మాయిలు, ఏడాది వయసున్న పిల్లలను పట్టుకుని క్యూలో నిలబడటం” కనిపిస్తుందని ఆమె చెప్పడం అప్పట్లోనూ చర్చలకు దారితీసింది. గవర్నర్ పదవిలో ఉండి, ఒక నిర్దిష్ట జీవనశైలిని ఇంత హింసతో ముడిపెట్టి మాట్లాడటం సరైనది కాదని పౌర హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మరికొందరు ఆమె మాటలు కఠినంగా ఉన్నా వాస్తవమే అని మద్దతు ఇస్తున్నారు.
యూపీ గవర్నర్ ఈ సందర్భంలో ఒక జడ్జితో తాను మాట్లాడిన సంభాషణను కూడా గుర్తు చేసుకున్నారు. మహిళల భద్రత గురించి ఆ జడ్జి కూడా ఆందోళన వ్యక్తం చేశారని, యువతులు తమను తాము లైంగిక దోపిడీ నుంచి కాపాడుకోవడానికి యూనివర్సిటీల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించాలని సూచించినట్లు గవర్నర్ తెలిపారు. అంతేకాకుండా, యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకం గురించి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి యువకుడు మాదకద్రవ్యాల వినియోగం నుంచి దూరంగా ఉంటే తాను చాలా సంతోషిస్తానని గవర్నర్ అన్నారు.
This post was last modified on October 10, 2025 1:03 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…