ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతానికి ఇప్పటికి ఆయన చాలా తేడా చూపిస్తున్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నా, ఏమో ఏదైనా తేడా జరిగినా, అమరావతి విషయంలో గతంలో అంటే 2019-24 మధ్య జరిగినట్టుగా జరగకూడదని ఆయన భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో అమరావతి నిర్మాణాలపై అనేక లక్ష్యాలు, నిర్దేశిత గడువులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగానే 2027 చివరి నాటికి తొలి దశ అమరావతి నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణను కూడా రెడీ చేసుకున్నారు.
ఇలా రాజధానిని పరుగు పెట్టించే క్రమంలో దీనిలో ఇమిడి ఉన్న ఇతర ప్రాజెక్టులకు ఎస్పీవీ అనే ఇంధనాన్ని జోడించారు. ఫలితంగా ఆయా ప్రాజెక్టులు మరింత వేగంగా పరిగులు పెట్టనున్నాయి. అంతేకాదు, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు బాధ్యతను కూడా ఎస్పీవీ చోదక శక్తిగా మారుతుందని సీఎం చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
తాజాగా ఎస్పీవీకి చట్టబద్ధత కల్పించారు. దీనికి సంబంధించిన జీవోను మంగళవారం రాత్రి ప్రభుత్వం జారీ చేసింది. అంటే ఇక ఎస్పీవీ చట్టబద్ధమైనదని చెప్పొచ్చు.
ఏంటిది ఎస్పీవీ?
ఎస్పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ (ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసే కీలక విభాగం). దీనిని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అంటే రాజధానిలో ఈ ఎస్పీవీ కింద చేపట్టే పనులను ముందుగానే పేర్కొంటారు. అదేవిధంగా సంబంధిత ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని ముందుగానే నిర్దేశించి ఈ ఖాతాలో జమ చేస్తారు.
సదరు నిధులు ఈ ఖాతా నుంచి ఆయా ప్రాజెక్టులకు చేరతాయి. దీనిలో పక్కా లెక్క ఉంటుంది. అదేవిధంగా ఆడిటింగ్ కూడా చేస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తరచుగా రాష్ట్రాలను ఎస్పీవీలను ఏర్పాటు చేయాలని కోరుతుంది.
ఎస్పీవీ కింద చేసే పనులు ఇవే:
This post was last modified on October 8, 2025 12:44 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…