Political News

మంత్రుల తగువుతో హీట్ పెరిగింది

తెలంగాణలో రెండు కీలక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. కానీ పార్టీ నేతల మధ్య ఐక్యత నినాదం కొనసాగుతున్నా, మంత్రుల మధ్య మాత్రం విభేదాల మంటలు చెలరేగుతున్నాయి.

తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం పెద్దదిగా మారింది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో అడ్లూరికి అవకాశం దక్కగా, తాను పీఠం దక్కించుకున్న తర్వాత కొందరు మంత్రులు తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందులో ముఖ్యంగా పొన్నం ప్రవర్తనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

రహ్మత్‌నగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పొన్నం తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అడ్లూరి ఆరోపించారు. “నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని. ప్రజల ఓట్లతో గెలిచాను. ఎవరి జోలికి వెళ్లి పదవులు సంపాదించుకోలేదు. పొన్నం ప్రభాకర్ నా జోలికి రాకుండా ఉండటం మంచిది. లేకపోతే ఫలితాలు ఆయనే భరించాలి” అని అడ్లూరి సూటిగా హెచ్చరించారు.

ఇక దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “ఆయన మనసు నొచ్చుకున్నందుకు నేను విచారిస్తున్నా. రాజకీయ దురుద్దేశంతో నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. నా ఉద్దేశం ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు” అని స్పష్టీకరించారు.

ఈ మాటల యుద్ధం కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్తతను మరింత పెంచింది. ముఖ్యంగా కుల వివాదం రూపం దాల్చిన ఈ వ్యవహారం ఎన్నికల ముందు పార్టీకి ఇబ్బందులు తెచ్చే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

This post was last modified on October 8, 2025 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

39 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago