“మీరెవరూ ఇంతకు ముందు చూడని, కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం. 2028 నాటికితొలి దశ నిర్మాణాలను పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాం. అద్భుతమైన నిర్మాణాలే కాదు.. ప్రపంచస్థాయి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక అద్భుత నగరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి రాజధాని సహా.. రాష్ట్రంలో గత 15 మాసాల్లో చేపట్టిన అభివృద్ధిని వారికి వివరించారు.
సన్ రైజ్ ఏపీ!
సన్ రైజ్ ఏపీ నినాదంతో రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. పీపీపీ విధానం ద్వారా సంపద సృష్టికి మార్గాలు పరిచామన్న ఆయన.. పీ-4 విధానంలో 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందని చెప్పారు. 2024-25 లో 8.25 వృద్ధిరేటు సాధించామన్న చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ‘సన్రైజ్ ఆంధ్రప్రదేశ్’ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు గంటా 20 నిమిషాల సేపు ప్రసంగించారు.
బాబు ప్రసంగంలో కీలకాంశాలు!
This post was last modified on October 1, 2025 11:14 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…