“మీరెవరూ ఇంతకు ముందు చూడని, కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం. 2028 నాటికితొలి దశ నిర్మాణాలను పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాం. అద్భుతమైన నిర్మాణాలే కాదు.. ప్రపంచస్థాయి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక అద్భుత నగరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి రాజధాని సహా.. రాష్ట్రంలో గత 15 మాసాల్లో చేపట్టిన అభివృద్ధిని వారికి వివరించారు.
సన్ రైజ్ ఏపీ!
సన్ రైజ్ ఏపీ నినాదంతో రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. పీపీపీ విధానం ద్వారా సంపద సృష్టికి మార్గాలు పరిచామన్న ఆయన.. పీ-4 విధానంలో 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందని చెప్పారు. 2024-25 లో 8.25 వృద్ధిరేటు సాధించామన్న చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ‘సన్రైజ్ ఆంధ్రప్రదేశ్’ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు గంటా 20 నిమిషాల సేపు ప్రసంగించారు.
బాబు ప్రసంగంలో కీలకాంశాలు!
This post was last modified on October 1, 2025 11:14 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…