“మీరెవరూ ఇంతకు ముందు చూడని, కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం. 2028 నాటికితొలి దశ నిర్మాణాలను పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాం. అద్భుతమైన నిర్మాణాలే కాదు.. ప్రపంచస్థాయి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక అద్భుత నగరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి రాజధాని సహా.. రాష్ట్రంలో గత 15 మాసాల్లో చేపట్టిన అభివృద్ధిని వారికి వివరించారు.
సన్ రైజ్ ఏపీ!
సన్ రైజ్ ఏపీ నినాదంతో రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. పీపీపీ విధానం ద్వారా సంపద సృష్టికి మార్గాలు పరిచామన్న ఆయన.. పీ-4 విధానంలో 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందని చెప్పారు. 2024-25 లో 8.25 వృద్ధిరేటు సాధించామన్న చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ‘సన్రైజ్ ఆంధ్రప్రదేశ్’ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు గంటా 20 నిమిషాల సేపు ప్రసంగించారు.
బాబు ప్రసంగంలో కీలకాంశాలు!
This post was last modified on October 1, 2025 11:14 am
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…