తమిళనాట సినిమాల్లో దళపతిగా పేరు తెచ్చుకుని ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు చక్రబందంలో చిక్కుకున్నారనే చెప్పాలి. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన విజయ్.. మరో 7 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో 41 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాట రాజకీయ ప్రకంపనలను రేపింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం విజయ్ కు ఫోన్ చేసి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.
ఈ ఫోన్ కాల్… అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి బృందాలు తమిళనాడు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలోనే చోటుచేసుకుంది. ఇప్పటిదాకా విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కరూర్ ఘటనతో విజయ్ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ కు ఇప్పుడు ఇండియా కూటమి గానీ లేదంటే ఎన్డీఏ కూటమి మద్దతు గానీ తప్పనిసరిగా అవసరం అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరి విజయ్ ఎవరి వైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో ఇండియా కూటమిలోని కీలక భాగస్వామి డీఎంకే అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. రాహుల్ ఫోన్ చేశారన్న భావనతో డీఎంకే సర్కారు విజయ్ ను, ఆయన పార్టీని రక్షించవచ్చు గానీ… దాని పరిణామాలు చాలా ఘాటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు విజయ్ మద్దతు పలికితే… కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నేరుగా రంగంంలోకి దిగి కరూర్ ఘటనపై దర్యాప్తు అంటూ సతాయించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎన్నికల
సంఘానికి ఫిర్యాదు చేసి ఏకంగా పార్టీని రద్దు చేయించే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఎన్డీఏకు విజయ్ మద్దతు తెలిపితే తమిళనాడులోని డీఎంకే సర్కారు ఆయనను క్షణాల్లో అరెస్టు చేసి సరిగ్గా ఎన్నికల ముందు ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితిని విజయ్ ఎలా దాటగలుగుతారో చూడాలి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…