Political News

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో గంట గ్యాప్‌… చంద్ర‌బాబు ఏం చేశారంటే!

సీఎం చంద్ర‌బాబు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల‌తో మ‌రోసారి టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. ఈ ప‌ర్య‌ట‌న‌లో దొరికిన ఓ గంట గ్యాప్‌ను కూడా వ‌దులు కోకుండా.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అభివృద్ధిపై స్పందించారు. స‌హ‌జంగా నిరంత‌రం బిజీగా ఉండే సీఎం చంద్ర‌బాబు ఓ గంట గ్యాప్ ల‌భిస్తే.. రెస్టు తీసుకోవ‌చ్చు. ఎవ‌రూ ఏమీ అడ‌గ‌రు. పైగానిత్యం ఆయ‌న ప్ర‌జ‌ల‌తోనే ఉంటున్నారు. అయినా.. కూడా చంద్ర‌బాబు అలాంటి ఆలోచ‌న చేయ‌లేదు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో దొరికిన గంట గ్యాప్‌ను కూడా ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడేందుకు వినియోగించుకున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు. జూమ్ ద్వారా నాయ‌కుల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం విద్యుత్ చార్జీల త‌గ్గింపు విష‌యంలో వైసీపీ చేస్తున్న ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనాల‌ని వారికి సూచించారు. అదేస‌మ‌యంలో స‌మ‌ర్థ పాల‌న‌కు, వైసీపీ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఉన్న తేడాను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డమే కాకుండా.. ఆధారాల‌ను కూడా చూపించాల‌న్నారు.

వైసీపీ హ‌యాంలో విద్యుత్ చార్జీల‌ను ఎలా పెంచారో.. ఆధారాల‌తో పాటు పాత బిల్లులను కూడా చూపించి వివ‌రిం చాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. అప్ప‌ట్లో ట్రూ అప్ పేరుతో ప్ర‌జ‌ల నుంచి ఎలా వ‌సూలు చేశారో.. అంద‌రికీ చెప్పాల‌న్నారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. ట్రూ డౌన్‌పేరుతో త‌గ్గించామ‌ని.. దీనివల్ల ప్ర‌జ‌ల‌కు విద్యుత్ చార్జీల భారం త‌గ్గుతుంద‌ని.. ఈ విష‌యాన్ని వారికి స‌మ‌గ్రంగా వివ‌రించాల‌ని తెలిపారు. కేవ‌లం మాట‌లు చెప్పి స‌రిపెట్ట‌డం కాకుండా.. ప్ర‌జ‌లకు అస‌లు అప్ప‌ట్లో ఏం జ‌రిగింది? ఇప్పుడు ఏం జ‌రుగుతోందో కూడా వివ‌రించాల‌న్నారు. మొత్తానికి చంద్ర‌బాబు త‌న‌కు ల‌భించిన గంట గ్యాప్‌ను కూడా వ‌దిలి పెట్ట‌కుండా.. ప‌నిచేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

This post was last modified on September 30, 2025 6:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago