తెలంగాణ స్థానిక సంస్థలకు నగారా మోగింది. గత కొన్నాళ్లుగా చర్చనీయాంశం అయిన.. ఈ ఎన్నికలను హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్వహించకతప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ స్థానిక సమరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం..
+ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం 5 దశల్లో జరుగుతాయి.
+ మండల ప్రజాపరిషత్(ఎంపీటీసీ), జిల్లా ప్రజాపరిషత్(జడ్పీటీసీ)లకు తొలి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
+ గ్రామ పంచాయతీలకు 3, 4, 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
+ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్ 23, 27 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
+ నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతారు.
+ గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పోలింగ్ జరుగుతుంది.
+ గ్రామ పంచాయతీల్లో పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు.
ప్రక్రియ ఇలా మొదలు..
ఫస్ట్ ఫేజ్: నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9-11 మధ్య, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 12, నామినేషన్ల ఉపసంహరణ-అక్టోబర్ 15న చేపడతారు.
సెకండ్ ఫేజ్: నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13-15 మధ్య, నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 16న చేపడతారు. ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు అవకాశం ఉంటుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ.. నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17-19 మధ్య ఉంటుంది. పరిశీలన: అక్టోబర్ 20న చేపడతారు. ఉపసంహరణకు అక్టోబర్ 23 వరకు అవకాశం ఉంది. రెండో దశలో నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 21- 23తేదీలను నిర్ణయించారు. వీటి పరిశీలన: అక్టోబర్ 24, ఉపసంహరణ- అక్టోబర్ 27న ఉంటుంది. మూడో దశలో నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 25- 27 మధ్య ఉంటుంది. వీటి పరిశీలన: అక్టోబర్ 28న చేపడతారు. ఉపసంహరణకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది.
ఎన్నెన్ని ఉన్నాయి?
+ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాలు ఉన్నాయి.
+ వీటిలో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి
+ వీటిలో మొత్తం 1,12,288 వార్డులు ఉన్నాయి.
+ మొత్తం 12,733 గ్రామపంచాయతీలు ఉండగా వీటికి మూడు దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…