Political News

400 కోట్ల ఖర్చు: ఆటో డ్రైవర్లకు ఇంకా కావాలట

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వచ్చే నెల నాలుగో తేదీన “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై పెద్ద ప్రభావం పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా ఉందని కూడా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కు ఏడాదికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. తద్వారా మహిళలకు కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని నిరవధికంగా కొనసాగించడంతో పాటు ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, ఇది ఊహించని పథకం. అంటే గత ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలలో ఆటో డ్రైవర్ల సాయం ఎక్కడా లేదు. కానీ, అనుబంధంగా వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు కొత్త పథకాన్ని భుజాలపై ఎత్తుకోవాల్సి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల సంఖ్యను పరిశీలిస్తే సుమారు నాలుగు లక్షల వరకు ఉందని అంచనా వేశారు. వీరందరికీ 15 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే సుమారు 400 కోట్ల రూపాయలు ఏడాదికి ప్రభుత్వంపై భారం పడనుంది. మరి ఇంత భారం ప్రభుత్వం మోయగలదా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే మోసే అవకాశం లేదు. అయినప్పటికీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం 400 కోట్ల రూపాయల భారాన్ని కూడా భరించేందుకు ముందుకు వచ్చింది.

ఇది మంచి పరిణామం అయినప్పటికీ ఏడాదికి 15 వేల రూపాయలు అంటే తమకు ఏ మూలకు సరిపోతాయని, నెలకు వెయ్యి రూపాయలకే మించి పడటం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. అంటే ఒకవైపు వారికి సహాయం చేస్తూనే మరోవైపు చేయలేదనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.

గత వైసిపి హయాంలో కూడా ఆటో డ్రైవర్లకు “వాహన మిత్ర” పథకం కింద 10 వేల రూపాయలు ఇచ్చారు. అప్పట్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం లేకపోవడంతో పాటు ఇతర ఉచిత రవాణా పథకాలేవీ లేవు.

దీంతో ఆటో డ్రైవర్లకు 10 వేల రూపాయలు కిట్టుబాటు అయ్యింది. కానీ ఇప్పుడు వారికి కిరాయిలు తగ్గాయి. అదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు అమలవుతున్న నేపథ్యంలో ఆటోలు ఖాళీగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 15 వేల ఇస్తున్నప్పటికీ వారికి ఏమాత్రం సరిపోవడంలేదని చెబుతున్నారు.

మొత్తంగా ప్రభుత్వం ఇస్తున్నామని చెబుతోంది… అటువైపు డ్రైవర్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో చూడాలి.


Satya

Recent Posts

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

1 hour ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

2 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

4 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

4 hours ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

8 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

8 hours ago