రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వచ్చే నెల నాలుగో తేదీన “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై పెద్ద ప్రభావం పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా ఉందని కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఆటో డ్రైవర్కు ఏడాదికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. తద్వారా మహిళలకు కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని నిరవధికంగా కొనసాగించడంతో పాటు ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఇది ఊహించని పథకం. అంటే గత ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలలో ఆటో డ్రైవర్ల సాయం ఎక్కడా లేదు. కానీ, అనుబంధంగా వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు కొత్త పథకాన్ని భుజాలపై ఎత్తుకోవాల్సి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల సంఖ్యను పరిశీలిస్తే సుమారు నాలుగు లక్షల వరకు ఉందని అంచనా వేశారు. వీరందరికీ 15 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే సుమారు 400 కోట్ల రూపాయలు ఏడాదికి ప్రభుత్వంపై భారం పడనుంది. మరి ఇంత భారం ప్రభుత్వం మోయగలదా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే మోసే అవకాశం లేదు. అయినప్పటికీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం 400 కోట్ల రూపాయల భారాన్ని కూడా భరించేందుకు ముందుకు వచ్చింది.
ఇది మంచి పరిణామం అయినప్పటికీ ఏడాదికి 15 వేల రూపాయలు అంటే తమకు ఏ మూలకు సరిపోతాయని, నెలకు వెయ్యి రూపాయలకే మించి పడటం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. అంటే ఒకవైపు వారికి సహాయం చేస్తూనే మరోవైపు చేయలేదనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.
గత వైసిపి హయాంలో కూడా ఆటో డ్రైవర్లకు “వాహన మిత్ర” పథకం కింద 10 వేల రూపాయలు ఇచ్చారు. అప్పట్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం లేకపోవడంతో పాటు ఇతర ఉచిత రవాణా పథకాలేవీ లేవు.
దీంతో ఆటో డ్రైవర్లకు 10 వేల రూపాయలు కిట్టుబాటు అయ్యింది. కానీ ఇప్పుడు వారికి కిరాయిలు తగ్గాయి. అదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు అమలవుతున్న నేపథ్యంలో ఆటోలు ఖాళీగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 15 వేల ఇస్తున్నప్పటికీ వారికి ఏమాత్రం సరిపోవడంలేదని చెబుతున్నారు.
మొత్తంగా ప్రభుత్వం ఇస్తున్నామని చెబుతోంది… అటువైపు డ్రైవర్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో చూడాలి.
This post was last modified on September 29, 2025 6:52 am
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…